Kerala: డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐదేళ్లుగా మహిళ కడుపులో కత్తెర, విచారణకు మంత్రి ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctors forgot to remove forceps from Kerala woman’s stomach: సిజేరియన్ ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ మహిళ కడుపులో కత్తెర మరిచారు. దీంతో గత ఐదేళ్లుగా కేరళకు చెందిన హర్షినా అనే మహిళ తీవ్ర నొప్పిని భరిస్తోంది. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా కూడా ఈ నొప్పి తగ్గలేదు. గత ఆరు నెలలుగా నొప్పి తగ్గేందుకు హర్షినాకు డాక్టర్లు పవర్ ఫుల్ యాంటీబయాటిక్స్ తో చికిత్స చేశారు అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే చెకప్ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా స్కానింగ్ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కడుపులో ఓ లోహ వస్తువు ఉన్నట్లు స్కానింగ్ లో బయటపడింది.
2017లో కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు హర్షినాకు సిజేరియన్ చేశారు. ఆ సమయంలో శస్త్రచికిత్సకు వాడే ‘‘ఫోర్సెప్స్’’ను కడుపులోనే మరిచారు. ఫోర్సెప్స్ అనేది శస్త్రచికిత్స సమయంలో రక్తనాళాలను బిగించేందుకు ఉపయోగించే కత్తెర లాంటి పరికరం. అయితే అప్పటి నుంచి సదరు మహిళ నొప్పితో బాధపడుతోంది. అంతకుముందు రెండు సార్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంది హర్షినా. అయితే కోజికోడ్ మెడికల్ కాలేజీలో సిజేరియన్ చేసినప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడేది.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
Read Also: South Africa: రెండో వన్డేకు ముందు విషాదంలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్
మూడవ శస్త్రచికిత్స తరువాత నొప్పిని భరించే దానిని అని.. అయితే ఇది సిజేరియన్ వల్లే అని అనుకున్నానని..దీని కోసం చాలా సార్లు వైద్యులను సంప్రదించానని ఆమె చెప్పుకొచ్చారు. నా కడుపులో ఉన్న లోహపు వస్తువు మూత్రనాళాన్ని గుచ్చుకోవడంతో భరించలేని నొప్పి వచ్చేదని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి కడుపలోని ఫోర్సెప్స్ ను బయటకు తీశారు. ఈ ఘటనపై హర్షినా, వైద్యులపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ శనివారం విచారణకు ఆదేశించారు. దీనిపై నివేదిక సమర్పించాలని ఆరోగ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ కూడా విచారణకు ఆదేశించింది.
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!