Kerala: డాక్టర్ల నిర్లక్ష్యం.. ఐదేళ్లుగా మహిళ కడుపులో కత్తెర, విచారణకు మంత్రి ఆదేశం
Doctors forgot to remove forceps from Kerala woman’s stomach: సిజేరియన్ ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ మహిళ కడుపులో కత్తెర మరిచారు. దీంతో గత ఐదేళ్లుగా కేరళకు చెందిన హర్షినా అనే మహిళ తీవ్ర నొప్పిని భరిస్తోంది. ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా కూడా ఈ నొప్పి తగ్గలేదు. గత ఆరు నెలలుగా నొప్పి తగ్గేందుకు హర్షినాకు డాక్టర్లు పవర్ ఫుల్ యాంటీబయాటిక్స్ తో చికిత్స చేశారు అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే చెకప్ కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా స్కానింగ్ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కడుపులో ఓ లోహ వస్తువు ఉన్నట్లు స్కానింగ్ లో బయటపడింది.
2017లో కోజికోడ్ మెడికల్ కాలేజీ వైద్యులు హర్షినాకు సిజేరియన్ చేశారు. ఆ సమయంలో శస్త్రచికిత్సకు వాడే ‘‘ఫోర్సెప్స్’’ను కడుపులోనే మరిచారు. ఫోర్సెప్స్ అనేది శస్త్రచికిత్స సమయంలో రక్తనాళాలను బిగించేందుకు ఉపయోగించే కత్తెర లాంటి పరికరం. అయితే అప్పటి నుంచి సదరు మహిళ నొప్పితో బాధపడుతోంది. అంతకుముందు రెండు సార్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంది హర్షినా. అయితే కోజికోడ్ మెడికల్ కాలేజీలో సిజేరియన్ చేసినప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడేది.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
Read Also: South Africa: రెండో వన్డేకు ముందు విషాదంలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్
మూడవ శస్త్రచికిత్స తరువాత నొప్పిని భరించే దానిని అని.. అయితే ఇది సిజేరియన్ వల్లే అని అనుకున్నానని..దీని కోసం చాలా సార్లు వైద్యులను సంప్రదించానని ఆమె చెప్పుకొచ్చారు. నా కడుపులో ఉన్న లోహపు వస్తువు మూత్రనాళాన్ని గుచ్చుకోవడంతో భరించలేని నొప్పి వచ్చేదని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి కడుపలోని ఫోర్సెప్స్ ను బయటకు తీశారు. ఈ ఘటనపై హర్షినా, వైద్యులపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ శనివారం విచారణకు ఆదేశించారు. దీనిపై నివేదిక సమర్పించాలని ఆరోగ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ కూడా విచారణకు ఆదేశించింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!