Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- ప్రాంతీయ పార్టీల నేతలతో కనిమొళి వరుస సమావేశాలు
- ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, సుప్రియా సూలేతో ఇప్పటికే భేటీలు
- తాజాగా మమతా బెనర్జీతోనూ కనిమొళి సమావేశం
- థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఊహాగానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Third Front: జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే ‘‘థర్డ్ ఫ్రంట్’’కు పునాది పడుతుందా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి. డీఎంకే ఎంపీ కనిమొళి వరసగా ప్రాంతీయ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్కు దూరంగా ప్రాంతీయ పార్టీలతో కొత్త కూటమి కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు కొత్త కూటమిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
వరస భేటీలో కనిమొళి బిజీ బిజీ..
కనిమొళి ఇటీవల ముంబైలో శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్, ఇండియా కూటమి భవిష్యత్తు, ప్రాంతీయ పార్టీల పాత్రపై చర్చ జరిగినట్లు ఉద్ధవ్ సేన వర్గాలు తెలిపాయి. దీని తర్వాత కనిమొళి ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె ఎంపీ సుప్రియా సూలేతో భేటీ అయ్యారు.
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే, తాజాగా ఆమె టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో కోల్కతాలో సమావేశమయ్యారు. ఈ భేటీతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలతో కొత్త ఫ్రంట్ తయారవుతుందనే ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ఒక ప్రయత్నం మొదలైనట్లుగా చెప్పుకుంటున్నారు.
కాంగ్రెస్తో సంబంధాలు చెడిపోయిన తర్వాత డీఎంకే కొత్తగా థర్డ్ ఫ్రంట్పై దృష్టి కేంద్రీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తమిళనాడులో నటుడు విజయ్కు చెందిన టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో డీఎంకే ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటోంది.
థర్డ్ ఫ్రంట్ కొత్తేమీ కాదు..
దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గతంలో యూపీఏ కాకుండా కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు పలువురు ప్రయత్నించారు. 2013లో మమతా బెనర్జీ కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ దూరంగా ఉన్న పార్టీలతో ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటుకు ప్రయత్నించారు. దీని తర్వాత 2018లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కూడా మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ తదితర ప్రాంతీయ నేతలతో చర్చలు జరిపారు. అయితే, ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాంటి ప్రయత్నాలతో ప్రతిపక్ష రాష్ట్రాల సీఎంలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. య
తాజావార్తలు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!