DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం
- రేపు బెంగళూరులో కీలక సమావేశం ఉంది
- ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. గురువారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం.. సాయంత్రం గవర్నర్ ఆమోదించడం కూడా జరిగి పోయింది. ఇక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఢిల్లీలో ఉన్న డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా జాగ్రత్తగా.. ఆచితూచి స్పందించారు.
కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయలేమని స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నాయకుడిని ఇంకా అధికారికంగా ఎన్నుకోలేదు. ఆ నిర్ణయం పూర్తిగా లెజిస్లేటర్ల ద్వారా ఫార్మలైజ్ అయ్యే వరకు ప్రమాణస్వీకారం ఎప్పుడు జరుగుతుందో ఎలా చెప్పగలను?” అని శివకుమార్ వ్యాఖ్యానించారు. శనివారం జరగనున్న CLP సమావేశానికి ముందుగా ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి.
Also Read
- Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
- Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
- Sergio Gor: భారత్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతోంది.. పెట్టుబడులకు విశ్వసనీయ ప్రాంతమన్న సెర్గియా గోర్
- Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
రేపు కేంద్ర నాయకత్వం సీఎల్పీ సమావేశానికి హాజరుకానుందని… కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు రావాలని ఆదేశించినట్లు తెలిపారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటే కాకుండా కర్ణాటకలో పార్టీ సంస్థాగత నియామకాలు, రాజ్యసభ సీట్ల పంపకంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని… రాజ్యసభ అభ్యర్థుల ఎంపికను రాష్ట్రాల వారీగా కాకుండా జాతీయ స్థాయిలో ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందని శివకుమార్ వెల్లడించారు. కీలకమైన శాసన ప్రక్రియలు, అధికారిక లాంఛనాలు పూర్తైన తర్వాతే ఏ నిర్ణయమైనా ప్రకటించగలమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రధాన దృష్టి లెజిస్లేచర్ పార్టీ నాయకత్వ ఎన్నికపైనే ఉందని తేల్చి చెప్పారు.
మరోవైపు సిద్దరామయ్య తన కుమారుడు యతీంద్రను ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ హైకమాండ్ను కోరినట్లు సమాచారం. అలాగే కేఎస్ జార్జ్, జీ పరమేశ్వరను కేబినెట్లో కొనసాగించాలని కూడా సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ తుది చర్చలు జరుపుతోంది.
తాజావార్తలు
-
DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
-
Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
-
Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
-
Rishabh Pant: రూ.27 కోట్ల పంత్ ఫెయిల్.. LSG కెప్టెన్సీకి గుడ్బై
-
Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!