Ajit Pawar: ఇద్దరికి మించి పిల్లలుంటే, పోటీకి అనర్హులు.. అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disqualify MPs and MLAs who have 3 kids says Ajit Pawar: మన భారతదేశ జనాభా క్రమంగా ఎలా పెరుగుతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నిన్నటి వరకు ప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న మన దేశం.. ఇప్పుడు చైనాను దాటేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే దేశంలో జనాభా పెరుగుదలపై ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనాభా నియంత్రణ క్రమంలో.. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలున్న వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చెప్పారు. అంతేకాదు.. ఇద్దరికి మించి ఎక్కువ సంతానం ఉన్న వారిని ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
SRH vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
బారామతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘‘రోజురోజుకీ మన దేశ జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. విలాస్రావు దేశ్ముఖ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ముగ్గురు పిల్లలున్న ప్రతినిధుల్ని మేము అనర్హులుగా ప్రకటించాం. అప్పట్లో చాలా జాగ్రత్త వహించి, ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే.. ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ఆరోజుల్లో కొందరు జనాలు మమ్మల్ని ప్రకటించారు. దీనిపై నేను ఇవ్వదలచుకున్న వివరణ ఒక్కటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన పవర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. కేంద్రం కూడా ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్’’ అని చెప్పుకొచ్చారు. మన దేశ జనాభా 142 కోట్లకు పైగా చేరిందని, ఇందుకు మనమే బాధ్యులమని, ఈ అంశాన్ని అందరూ సీరియస్గా తీసుకోవాలని అన్నారు.
Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
మన దేశం, రాష్ట్ర, జిల్లా బాగుండాలంటే.. ఒకరిద్దరు పిల్లలకే పరిమితం కావాలని అజిత్ పవార్ పిలుపునిచ్చారు. ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని.. దీంతో ప్రజల్లో జనాభా పెరుగుదల సమస్యపై మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు. ఒకవేళ దంపతులకు మొదటి సంతానం తర్వాత రెండోసారి డెలివరీలో కవలలు పుడితే.. అప్పుడు వారి తప్పు లేదన్నారు. కాగా.. ఈ ఏడాది జనవరిలోనూ ఇద్దరు పిల్లల నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే.. కొడుకు కోసం పట్టుపట్టవద్దని ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!