Ajit Pawar: ఇద్దరికి మించి పిల్లలుంటే, పోటీకి అనర్హులు.. అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disqualify MPs and MLAs who have 3 kids says Ajit Pawar: మన భారతదేశ జనాభా క్రమంగా ఎలా పెరుగుతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నిన్నటి వరకు ప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న మన దేశం.. ఇప్పుడు చైనాను దాటేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే దేశంలో జనాభా పెరుగుదలపై ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనాభా నియంత్రణ క్రమంలో.. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలున్న వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చెప్పారు. అంతేకాదు.. ఇద్దరికి మించి ఎక్కువ సంతానం ఉన్న వారిని ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
SRH vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
బారామతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘‘రోజురోజుకీ మన దేశ జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. విలాస్రావు దేశ్ముఖ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ముగ్గురు పిల్లలున్న ప్రతినిధుల్ని మేము అనర్హులుగా ప్రకటించాం. అప్పట్లో చాలా జాగ్రత్త వహించి, ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే.. ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ఆరోజుల్లో కొందరు జనాలు మమ్మల్ని ప్రకటించారు. దీనిపై నేను ఇవ్వదలచుకున్న వివరణ ఒక్కటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన పవర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. కేంద్రం కూడా ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్’’ అని చెప్పుకొచ్చారు. మన దేశ జనాభా 142 కోట్లకు పైగా చేరిందని, ఇందుకు మనమే బాధ్యులమని, ఈ అంశాన్ని అందరూ సీరియస్గా తీసుకోవాలని అన్నారు.
Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
మన దేశం, రాష్ట్ర, జిల్లా బాగుండాలంటే.. ఒకరిద్దరు పిల్లలకే పరిమితం కావాలని అజిత్ పవార్ పిలుపునిచ్చారు. ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని.. దీంతో ప్రజల్లో జనాభా పెరుగుదల సమస్యపై మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు. ఒకవేళ దంపతులకు మొదటి సంతానం తర్వాత రెండోసారి డెలివరీలో కవలలు పుడితే.. అప్పుడు వారి తప్పు లేదన్నారు. కాగా.. ఈ ఏడాది జనవరిలోనూ ఇద్దరు పిల్లల నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే.. కొడుకు కోసం పట్టుపట్టవద్దని ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!