Ajit Pawar: ఇద్దరికి మించి పిల్లలుంటే, పోటీకి అనర్హులు.. అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్
Disqualify MPs and MLAs who have 3 kids says Ajit Pawar: మన భారతదేశ జనాభా క్రమంగా ఎలా పెరుగుతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నిన్నటి వరకు ప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న మన దేశం.. ఇప్పుడు చైనాను దాటేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే దేశంలో జనాభా పెరుగుదలపై ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనాభా నియంత్రణ క్రమంలో.. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలున్న వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చెప్పారు. అంతేకాదు.. ఇద్దరికి మించి ఎక్కువ సంతానం ఉన్న వారిని ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
SRH vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
Also Read
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- May 1st Labor Day: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. ఈరోజే ఎందుకు.. పూర్తి వివరాలు
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
బారామతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘‘రోజురోజుకీ మన దేశ జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. విలాస్రావు దేశ్ముఖ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ముగ్గురు పిల్లలున్న ప్రతినిధుల్ని మేము అనర్హులుగా ప్రకటించాం. అప్పట్లో చాలా జాగ్రత్త వహించి, ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే.. ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ఆరోజుల్లో కొందరు జనాలు మమ్మల్ని ప్రకటించారు. దీనిపై నేను ఇవ్వదలచుకున్న వివరణ ఒక్కటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన పవర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. కేంద్రం కూడా ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్’’ అని చెప్పుకొచ్చారు. మన దేశ జనాభా 142 కోట్లకు పైగా చేరిందని, ఇందుకు మనమే బాధ్యులమని, ఈ అంశాన్ని అందరూ సీరియస్గా తీసుకోవాలని అన్నారు.
Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
మన దేశం, రాష్ట్ర, జిల్లా బాగుండాలంటే.. ఒకరిద్దరు పిల్లలకే పరిమితం కావాలని అజిత్ పవార్ పిలుపునిచ్చారు. ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని.. దీంతో ప్రజల్లో జనాభా పెరుగుదల సమస్యపై మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు. ఒకవేళ దంపతులకు మొదటి సంతానం తర్వాత రెండోసారి డెలివరీలో కవలలు పుడితే.. అప్పుడు వారి తప్పు లేదన్నారు. కాగా.. ఈ ఏడాది జనవరిలోనూ ఇద్దరు పిల్లల నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే.. కొడుకు కోసం పట్టుపట్టవద్దని ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
-
Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
-
Shruti Haasan : హీరోయిన్గా కంటే ఐటంగర్ల్గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
-
AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
-
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్పై స్పందించిన హోల్డర్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!