Ajit Pawar: ఇద్దరికి మించి పిల్లలుంటే, పోటీకి అనర్హులు.. అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disqualify MPs and MLAs who have 3 kids says Ajit Pawar: మన భారతదేశ జనాభా క్రమంగా ఎలా పెరుగుతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నిన్నటి వరకు ప్రపంచంలో జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న మన దేశం.. ఇప్పుడు చైనాను దాటేసి, అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే దేశంలో జనాభా పెరుగుదలపై ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనాభా నియంత్రణ క్రమంలో.. ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలున్న వారికి ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని చెప్పారు. అంతేకాదు.. ఇద్దరికి మించి ఎక్కువ సంతానం ఉన్న వారిని ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
SRH vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
బారామతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడుతూ.. ‘‘రోజురోజుకీ మన దేశ జనాభా గణనీయంగా పెరిగిపోతోంది. విలాస్రావు దేశ్ముఖ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ముగ్గురు పిల్లలున్న ప్రతినిధుల్ని మేము అనర్హులుగా ప్రకటించాం. అప్పట్లో చాలా జాగ్రత్త వహించి, ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే.. ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదని ఆరోజుల్లో కొందరు జనాలు మమ్మల్ని ప్రకటించారు. దీనిపై నేను ఇవ్వదలచుకున్న వివరణ ఒక్కటే.. ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన పవర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. కేంద్రం కూడా ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్’’ అని చెప్పుకొచ్చారు. మన దేశ జనాభా 142 కోట్లకు పైగా చేరిందని, ఇందుకు మనమే బాధ్యులమని, ఈ అంశాన్ని అందరూ సీరియస్గా తీసుకోవాలని అన్నారు.
Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
మన దేశం, రాష్ట్ర, జిల్లా బాగుండాలంటే.. ఒకరిద్దరు పిల్లలకే పరిమితం కావాలని అజిత్ పవార్ పిలుపునిచ్చారు. ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వకూడదని.. దీంతో ప్రజల్లో జనాభా పెరుగుదల సమస్యపై మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు. ఒకవేళ దంపతులకు మొదటి సంతానం తర్వాత రెండోసారి డెలివరీలో కవలలు పుడితే.. అప్పుడు వారి తప్పు లేదన్నారు. కాగా.. ఈ ఏడాది జనవరిలోనూ ఇద్దరు పిల్లల నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే.. కొడుకు కోసం పట్టుపట్టవద్దని ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!