Disha Salian: “దిశా సాలియన్”పై గ్యాంగ్ రేప్.. “ఆదిత్య ఠాక్రే”పై విచారణ కోరుతూ తండ్రి పిటిషన్..
- మరోసారి తెరపైకి దిశా సాలియన్ కేసు..
- ఆదిత్య ఠాక్రేపై దిశ తండ్రి పిటిషన్..
- దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుతో సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disha Salian: దివంగత బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం, అతడి మాజీ మేనేజర్గా పని చేసిన దిశా సాలియన్ మరణం మరోసారి తెర పైకి వచ్చాయి. దిశా సాలియన్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్లోని 14వ అంతస్తు నుంచి అనుమానాస్పదంగా పడి చనిపోయింది. ఇది జరిగిన ఆరు రోజులకే సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన ఫ్లాట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దిశా సాలియన్ మరణించి 5 ఏళ్ల తర్వాత ఆమె తండ్రి శివసేన(ఠాక్రే) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. అయితే, దీనిపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తన పరువు తీయడానికి కోర్టులో ఈ కేసును వేశారని ఆరోపించారు.
సతీష్ సాలియన్ న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ జూన్ 8, 2020న సబర్బన్ మలాడ్లోని ఒక ఎత్తైన భవనం యొక్క 14వ అంతస్తు నుండి పడి దిషా మరణించాడు. ఆ తర్వాత పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) కేసును నమోదు చేశారు. ఆరు రోజుల తర్వాత, నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన బాంద్రా ఫ్లాట్లో చనిపోయాడు. పోలీసులు మొదట దీనిని ఆత్మహత్య కేసు అని చెప్పారు. ఆ తర్వాత దీనిని సీబీఐకి అప్పగించారు.
Also Read
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
Read Also: Meerut Murder: ‘‘నాన్న డ్రమ్లో ఉన్నాడు’’.. తండ్రి హత్య గురించి పక్కింటి వాళ్లకు చెప్పిన పాప..
2020లో, సతీష్ సాలియన్ తన కుమార్తె మరణంలో ఎవరిపైనా అనుమానాలు లేవని, దర్యాప్తుతో పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఇటీవల దిశా తండ్రి సతీష్ సాలియన్ తన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 08, 2020లో దిశా తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించిందని, దానికి ఆదిత్య ఠాక్రే, సూరజ్ పంచోలి, డినో మోరియా తదితరులు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనాలను ఉటంకిస్తూ.. దిశాపై సామూహిక అత్యాచారం జరిగిందని, బలవంతంగా నిర్బంధించడం, క్రూరమైన లైంగిక దాడికి గురైందని తన పిటిషన్లో పేర్కొన్నారు. దిశా ఎత్తైన భవనం నుంచి పడినప్పటికీ, ఆమె శరీరంపై ఒక్క బలమైన గాయం కూడా లేదని, సంఘటనా స్థలంలో రక్తం లేదని పిటిషన్లో ఆరోపించారు.
అప్పటి రాజకీయ నాయకుల ఒత్తిడితో, నిందితులను రక్షించడానికి అధికారికి శవపరీక్ష నివేదికను మార్చారని పిటిషన్లో ఆరోపించారు. ఫోరెన్సిక్ ఆధారాలు ధ్వంసం చేశారని, సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేశారని దిశ తండ్రి ఆరోపించారు. సరైన పోస్ట్మార్టం విశ్లేషణ లేకుండా త్వరగా దహన సంస్కారాలు జరిగాయని పిటిషన్ ఆరోపించింది. ఇదే కాకుండా, దిశ, సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోస్టుమార్టం టైమ్ని పిటిషన్లో ఎత్తిచూపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్కి అదే రోజు పోస్టుమార్టం నిర్వహిస్తే, దిశా పోస్టుమార్టానికి 50 గంటలకు పైగా ఆలస్యం చేశారని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఆదిత్య ఠాక్రేని రక్షించడానికి సాక్ష్యాలు నాశనం చేసినట్లు ఆరోపించారు.
తాజావార్తలు
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!