Disha Salian: “దిశా సాలియన్”పై గ్యాంగ్ రేప్.. “ఆదిత్య ఠాక్రే”పై విచారణ కోరుతూ తండ్రి పిటిషన్..
- మరోసారి తెరపైకి దిశా సాలియన్ కేసు..
- ఆదిత్య ఠాక్రేపై దిశ తండ్రి పిటిషన్..
- దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుతో సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disha Salian: దివంగత బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం, అతడి మాజీ మేనేజర్గా పని చేసిన దిశా సాలియన్ మరణం మరోసారి తెర పైకి వచ్చాయి. దిశా సాలియన్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్లోని 14వ అంతస్తు నుంచి అనుమానాస్పదంగా పడి చనిపోయింది. ఇది జరిగిన ఆరు రోజులకే సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన ఫ్లాట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దిశా సాలియన్ మరణించి 5 ఏళ్ల తర్వాత ఆమె తండ్రి శివసేన(ఠాక్రే) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. అయితే, దీనిపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తన పరువు తీయడానికి కోర్టులో ఈ కేసును వేశారని ఆరోపించారు.
సతీష్ సాలియన్ న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ జూన్ 8, 2020న సబర్బన్ మలాడ్లోని ఒక ఎత్తైన భవనం యొక్క 14వ అంతస్తు నుండి పడి దిషా మరణించాడు. ఆ తర్వాత పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) కేసును నమోదు చేశారు. ఆరు రోజుల తర్వాత, నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన బాంద్రా ఫ్లాట్లో చనిపోయాడు. పోలీసులు మొదట దీనిని ఆత్మహత్య కేసు అని చెప్పారు. ఆ తర్వాత దీనిని సీబీఐకి అప్పగించారు.
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
Read Also: Meerut Murder: ‘‘నాన్న డ్రమ్లో ఉన్నాడు’’.. తండ్రి హత్య గురించి పక్కింటి వాళ్లకు చెప్పిన పాప..
2020లో, సతీష్ సాలియన్ తన కుమార్తె మరణంలో ఎవరిపైనా అనుమానాలు లేవని, దర్యాప్తుతో పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఇటీవల దిశా తండ్రి సతీష్ సాలియన్ తన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 08, 2020లో దిశా తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించిందని, దానికి ఆదిత్య ఠాక్రే, సూరజ్ పంచోలి, డినో మోరియా తదితరులు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనాలను ఉటంకిస్తూ.. దిశాపై సామూహిక అత్యాచారం జరిగిందని, బలవంతంగా నిర్బంధించడం, క్రూరమైన లైంగిక దాడికి గురైందని తన పిటిషన్లో పేర్కొన్నారు. దిశా ఎత్తైన భవనం నుంచి పడినప్పటికీ, ఆమె శరీరంపై ఒక్క బలమైన గాయం కూడా లేదని, సంఘటనా స్థలంలో రక్తం లేదని పిటిషన్లో ఆరోపించారు.
అప్పటి రాజకీయ నాయకుల ఒత్తిడితో, నిందితులను రక్షించడానికి అధికారికి శవపరీక్ష నివేదికను మార్చారని పిటిషన్లో ఆరోపించారు. ఫోరెన్సిక్ ఆధారాలు ధ్వంసం చేశారని, సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేశారని దిశ తండ్రి ఆరోపించారు. సరైన పోస్ట్మార్టం విశ్లేషణ లేకుండా త్వరగా దహన సంస్కారాలు జరిగాయని పిటిషన్ ఆరోపించింది. ఇదే కాకుండా, దిశ, సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోస్టుమార్టం టైమ్ని పిటిషన్లో ఎత్తిచూపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్కి అదే రోజు పోస్టుమార్టం నిర్వహిస్తే, దిశా పోస్టుమార్టానికి 50 గంటలకు పైగా ఆలస్యం చేశారని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఆదిత్య ఠాక్రేని రక్షించడానికి సాక్ష్యాలు నాశనం చేసినట్లు ఆరోపించారు.
తాజావార్తలు
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!