Digvijay Singh: కేసీఆర్, జగన్లపై సెటైర్లు.. గులాంపై గుర్రు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digvijay Singh Satires On CM KCR and CM YS Jagan: భారత్ జోడో యాత్ర కోసం కన్యాకుమారికి చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్ సింగ్.. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద సెటైర్లు వేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వకుంటే, కేవలం ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్ పార్టీ తెచ్చేదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే, టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీన్ చేస్తానని అప్పట్లో కేసీఆర్ మాటిచ్చారని.. కానీ ఎక్కడ చేశాడని నిలదీశారు. కేసీఆర్ తమ కాంగ్రెస్ వ్యక్తేనని, తమతో జత కట్టొచ్చు కదా అని అడిగారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా కష్టపడుతున్నారని, రాహుల్ గాంధీ చేపట్టడిన భారత్ జోడో యాత్ర వల్ల తెలంగాణలో మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.
ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి దిగ్విజయ్ మాట్లాడుతూ.. జగన్ తమ రాజశేఖర్ రెడ్డి కొడుకేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుడు కావడం వల్లే జగన్ను ఏపీ ప్రజలు ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పారు. అయితే.. తాము కేసులు పెట్టామని జగన్ కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇటీవల కాంగ్రెస్ని వీడిన గులాం నబీ ఆజాద్పై దిగ్విజయ్ విరుచుకుపడ్డారు. అతడో నమ్మకద్రోహి అని.. పదువులు అన్ని అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ను, రాహుల్ని తిడుతున్నాడని ఫైరయ్యారు. తామిద్దరం కలిసి ఒకేసారి 1977లో కాంగ్రెస్ చేరామని, పదవులు లేకపోతే గులాం నబీ ఉండడని తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని గులాం నబీ చెప్పడం సిగ్గుమాలిన పని అని విమర్శించారు. G-23, సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న గులాంనను రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ గౌరవించారని వెల్లడించారు.
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను రాజకీయ కోణంలో చూడొద్దని దిగ్విజయ్ సింగ్ కోరారు. ఇది దైశాన్ని ఐక్యం చేసే యాత్ర అని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు భారతదేశాన్ని కులాలు, మతాల పేరుతో విడదీశారని.. భారత్ను ఏకం చేయగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్కు మాత్రమే ఉందని చెప్పారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు. ఆ రాష్ట్రంలో పాదయాత్ర లేనంత మాత్రానా, తాము అక్కడ లేమనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. మోదీ మన దేశాన్ని రెండు కార్పోరేట్ కంపెనీలకు అమ్మేశాడని, పేదలను బతికించేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!