Nehru Museum Renamed: నెహ్రూ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్, బీజేపీల మధ్య తాజా వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nehru Museum Renamed: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీగా మార్చాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీగా పేరు మార్చాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీ ప్రత్యేక సమావేశం తర్వాత దాని పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం మరియు లైబ్రరీ సొసైటీగా మార్చాలని నిర్ణయించారు. సొసైటీ ఉపాధ్యక్షుడు కూడా అయిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించారు.
Read Also: Viral News: విమానంలోకి పెద్ద పక్షి.. ఫైలట్ ముఖం నిండా రక్తం.. అయినా సరే..!
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
అయితే ఇప్పుడు ఈ నిర్ణయమే ఇరు పార్టీల మధ్య సరికొత్త వివాదాన్ని రేకెత్తించింది. దేశ రాజధాని ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ లోని మ్యూజియం పేరును మార్చడం జరిగింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత జైరాం రమేష్.. దేశ తొలి ప్రధానిగా చేసిన జవహర్ లాల్ నెహ్రూ విలువను తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆయన పార్టీ ఇలాంటి పని చేసిందని అన్నారు. ‘‘చరిత్ర లేని వారు, ఇతరుల చరిత్రను చెరిపేసేందుకు వెళ్లారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ పేరును మార్చడానికి దురదృష్టకర ప్రయత్నం ఆధునిక భారతదేశం యొక్క రూపశిల్పి మరియు పండిట్ జవహర్లాల్ నెహ్రూ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయదు. ఆయన ప్రజాస్వామ్య సంరక్షకుడు’’ అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ఇది ఆర్ఎస్ఎస్, బీజేపీ నీచ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీపై అంతే స్థాయిలో విరుచుకుపడింది. ఈ అంశాన్ని రాజకీయం చేయడం ఆపేయాలని సూచించింది. రాజవంశాని కన్నా గొప్ప నాయకులు భారతదేశానికి సేవ చేశారని.. దాన్ని కాంగ్రెస్ అంగీకరించడం లేదని, పేరు మార్పు అనేది రాజకీయాలకు అతీతంగా జరిగిన ప్రయత్నం.. దీనిని గ్రహించే దృక్పథం కాంగ్రెస్ కు లేదని నడ్డా ట్వీట్ చేశారు. ప్రధానులుగా పనిచేసిన సొంత నేతలను కూడా కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుదాన్షు త్రివేది అన్నారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!