Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
- ధర్మస్థల కేసులో కీలక పరిణామం..
- కోర్టుకు 7000 పేజీల నివేదిక సమర్పించిన సిట్..
- కోర్టు నిర్ణయంపై ఆధారపడిన తదుపరి దర్యాప్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmasthala Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ధర్మస్థలలో సామూహిక ఖననాలు జరిగాయనే ఆరోపణల్ని విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT), తన తుది దర్యాప్తు నివేదికను బెల్తంగడి కోర్టుకు సమర్పించింది. ఏడాది పాటు సిట్ ఈ కేసుపై దర్యాప్తు చేసింది. ఈ కేసులో కోర్టు నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయి. సిట్ ఎస్పీ తన టీమ్లో కలిసి నివేదిక దాఖలు చేయడానికి కోర్టుకు వచ్చారు. నివేదికతో పాటు దర్యాప్తు సమయంలో స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువుల్ని, కీలమైన సాక్ష్యాధారాలన్నింటిని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. బంగళగుడ్డె ఆస్తి రిజిస్టర్ను కూడా కోర్టుకు సమర్పించారు. దర్యాప్తు సమయంలో స్వాధీనం చేసుకున్న ఇతర సామాగ్రి, సాక్ష్యాలను కూడా కోర్టు రికార్డుల్లో చేర్చారు.
దాదాపు 7000 పేజీల నివేదికను కోర్టుకు దాఖలు చేశారు. నివేదిక దాఖలు చేసే సమయంలో మాస్క్ మ్యాన్ చిన్నయ్య, అతడి భార్య సిట్ అధికారులతో పాటే ఉన్నారు. ధర్మస్థలలో జరిగినట్లు ఆరోపించబడుతున్న సామూహిక ఖననాలు, హత్యలపై గతేడాది కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దీనిపై విచారణ జరుగుతోంది. కోర్టుకు తుది నివేదిక సమర్పించడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. మొత్తం ఈ కేసులో కుట్ర బయటపడే అవకాశం ఏర్పడింది.
Also Read
- Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
- Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
- Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
- IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
ఈ కేసు ఏమిటి?
దక్షిణ కన్నడ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థల గతేడాది వార్తల్లో నిలిచింది. 2025లో ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు (మాస్క్ మ్యాన్ చిన్నయ్య) సంచలన ఆరోపణలు చేశారు. ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో అనేక మృతదేహాలను రహస్యంగా పాతిపెట్టారని, వాటిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని ఆరోపించారు. తాను ఆ మృతదేహాలను పాతిపెట్టే పనిలో పాల్గొన్నానని చెప్పాడు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం కావడంతో సిట్ విచారణ చేపట్టింది. చిన్నయ్యను విచారించడంతో పాటు ఆయన చెప్పిన చోట తవ్వకాలు చేపట్టింది. పత్రాలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించింది. ఇప్పుడు వీటిని కోర్టుకు దాఖలు చేసింది.
ఈ కేసులో చిన్నయ్య స్టేట్మెంట్లలో వ్యత్యాసాలు, అబద్ధాలు ఉన్నట్లు అధికారులు గు ర్తించారు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, కొందరు వ్యక్తులు తనను భయపెట్టి, ఆలయ యాజమాన్యాన్ని బద్నాం చేయాలనే ఆలోచనతో తనతో అబద్ధపు ఆరోపణలు చేయించారని పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!