Phone Tapping Case: మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు.. రేపు విచారణకు రండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభాక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్కు నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు.. అక్రమంగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై ఆదివారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరుతూ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దేవేంద్ర ఫడ్నవీస్కు నోటీసులు జారీ చేశారు.. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్పై నమోదైన కేసులో ఫడ్నవీస్ను సాక్షిగా పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది విషయం తెలిసింది.
Read Also: Kollu Ravindra: వైఎస్ వివేకాను ఎవరు చంపారో క్లారిటీ వచ్చింది..
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
ఇక, ముంబై పోలీసుల నోటీసులపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బదిలీ పోస్టింగ్ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలుగా ఏమీ చేయలేదన్న ఆయన.. మహరాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో తప్పులను బయటపెట్టినందుకే తనకు నోటీసులు పంపారంటూ విమర్శలు గుప్పించారు.. అయితే, ఇలాంటి చర్యలకు తాను భయపడేదిలేదని స్పష్టం చేశారు.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.. కాగా, మహారాష్ట్ర హోం మంత్రిగా దిలీప్ వాల్సే పాటిల్ ఉన్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, మంత్రి బచ్చు కడు, మాజీ ఎమ్మెల్యే ఆశిష్ దేశ్ముఖ్, మాజీ ఎంపీ సంజయ్ కకడే తదితర రాజకీయ నేతల ఫోన్లను ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా అక్రమంగా ట్యాప్ చేశారని.. గత నెలలో ఆరోపించారు. ఇక, ఫడ్నవీస్కు జారీ చేసిన నోటీసులో ఈ కేసుకు సంబంధించి ప్రశ్నాపత్రాలను సీల్డ్ కవర్లో పంపామని, అయితే అతను వాటికి సమాధానం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, అతని సమాధానం కోరుతూ ఇప్పటికే రెండుసార్లు నోటీసులు కూడా జారీ చేయబడ్డాయి. అయినా సమాధానం ఇవ్వలేదంటున్నారు.. దీంతో పోలీసుల ఎదుట హాజరుకావాలని ఫడ్నవీస్కు మూడు లేఖలు కూడా పంపారు. అయితే, సమాధానం ఇవ్వడంలో ఫడ్నవీస్ విఫలమయ్యారని విమర్శించారు.. తాజా నోటీసులో, ఆదివారం సైబర్ పోలీసుల ముందు హాజరు కావాలని కోరినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!