Phone Tapping Case: మాజీ సీఎంకు పోలీసుల నోటీసులు.. రేపు విచారణకు రండి..
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభాక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్కు నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు.. అక్రమంగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై ఆదివారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరుతూ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దేవేంద్ర ఫడ్నవీస్కు నోటీసులు జారీ చేశారు.. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్పై నమోదైన కేసులో ఫడ్నవీస్ను సాక్షిగా పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది విషయం తెలిసింది.
Read Also: Kollu Ravindra: వైఎస్ వివేకాను ఎవరు చంపారో క్లారిటీ వచ్చింది..
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ఇక, ముంబై పోలీసుల నోటీసులపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బదిలీ పోస్టింగ్ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలుగా ఏమీ చేయలేదన్న ఆయన.. మహరాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో తప్పులను బయటపెట్టినందుకే తనకు నోటీసులు పంపారంటూ విమర్శలు గుప్పించారు.. అయితే, ఇలాంటి చర్యలకు తాను భయపడేదిలేదని స్పష్టం చేశారు.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.. కాగా, మహారాష్ట్ర హోం మంత్రిగా దిలీప్ వాల్సే పాటిల్ ఉన్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, మంత్రి బచ్చు కడు, మాజీ ఎమ్మెల్యే ఆశిష్ దేశ్ముఖ్, మాజీ ఎంపీ సంజయ్ కకడే తదితర రాజకీయ నేతల ఫోన్లను ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా అక్రమంగా ట్యాప్ చేశారని.. గత నెలలో ఆరోపించారు. ఇక, ఫడ్నవీస్కు జారీ చేసిన నోటీసులో ఈ కేసుకు సంబంధించి ప్రశ్నాపత్రాలను సీల్డ్ కవర్లో పంపామని, అయితే అతను వాటికి సమాధానం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, అతని సమాధానం కోరుతూ ఇప్పటికే రెండుసార్లు నోటీసులు కూడా జారీ చేయబడ్డాయి. అయినా సమాధానం ఇవ్వలేదంటున్నారు.. దీంతో పోలీసుల ఎదుట హాజరుకావాలని ఫడ్నవీస్కు మూడు లేఖలు కూడా పంపారు. అయితే, సమాధానం ఇవ్వడంలో ఫడ్నవీస్ విఫలమయ్యారని విమర్శించారు.. తాజా నోటీసులో, ఆదివారం సైబర్ పోలీసుల ముందు హాజరు కావాలని కోరినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!