Software Engineer: పని ఒత్తిడితో డిప్రెషన్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
- పని ఒత్తిడితో డిప్రెషన్..
- చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Software Engineer: ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి, 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి దేశవ్యాప్తంగా సంచలంగా మారింది. పని ఒత్తిడి వల్లే తన కూతురు చనిపోయిందని ఆమె తల్లి ఆరోపించారు. ఈ ఘటన ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఎలాంటి సమస్యలు, పని ఒత్తిడి ఉందనే విషయాన్ని హైలెట్ చేస్తున్నాయి. అన్నా మరణంపై అనేక మంది కార్పొరేట్ ఉద్యోగులు స్పందిస్తున్నారు. తాము కూడా ఇదే సమస్యల్ని ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడిపై కొనసాగుతున్న ఆందోళన మధ్య, తమిళనాడు థాజంబూర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగా తీవ్ర నిరాశకు గురైన 38 ఏళ్ల కార్తికేయ గురువారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు, అతడి భార్య గుడిచి వెళ్లి వచ్చే సరికి, కరెంట్ వైర్లు శరీరానికి చట్టుకుని అపస్మారకంగా పడి ఉన్నాడు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
Read Also: USA: పీఎం మోడీ యూఎస్ పర్యటనకు ముందు.. ఖలిస్తాన్ గ్రూపులతో వైట్హౌజ్ సమావేశం..
బాధితుడు తేనుకు చెందిన వ్యక్తి కాగా, గత 15 ఏళ్లుగా చెన్నైలోని పల్లవరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య జయరాణి, 10,8 వయసు కలిగిన ఇద్దరు పిల్లలతో అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. బాధితుడు గత రెండు నెలల క్రితం డిప్రెషన్తో మెదవాక్కంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతను పని ఒత్తిడికి గురైనట్లు చెప్పారు.
కార్తికేయ భార్య జయవాణి సోమవారం తన స్నేహితులు, పిల్లలతో కలిసి తిరునల్లారు ఆలయాని వెళ్లింది. కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. రాత్రి తిరిగి వచ్చి చూసేసరికి లోపల నుంచి గడియ వేసి ఉంది. తలుపు తెరవకపోవడంతో స్పేర్ కీతో తలుపు తెరిచింది. కార్తికేయన్ తన శరీరానికి ఎలక్ట్రిక్ వైర్లు చుట్టుకుని దానిని, విద్యుత్ బాక్సుకు కనెక్షన్ ఇచ్చి కరెంట్ షాక్తో చనిపోయాడు. తజాంబూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ola S1Z: భారత్లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
-
Saturday Horoscope: ఆగస్టు 29 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!