Software Engineer: పని ఒత్తిడితో డిప్రెషన్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
- పని ఒత్తిడితో డిప్రెషన్..
- చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Software Engineer: ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి, 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి దేశవ్యాప్తంగా సంచలంగా మారింది. పని ఒత్తిడి వల్లే తన కూతురు చనిపోయిందని ఆమె తల్లి ఆరోపించారు. ఈ ఘటన ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఎలాంటి సమస్యలు, పని ఒత్తిడి ఉందనే విషయాన్ని హైలెట్ చేస్తున్నాయి. అన్నా మరణంపై అనేక మంది కార్పొరేట్ ఉద్యోగులు స్పందిస్తున్నారు. తాము కూడా ఇదే సమస్యల్ని ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడిపై కొనసాగుతున్న ఆందోళన మధ్య, తమిళనాడు థాజంబూర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగా తీవ్ర నిరాశకు గురైన 38 ఏళ్ల కార్తికేయ గురువారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు, అతడి భార్య గుడిచి వెళ్లి వచ్చే సరికి, కరెంట్ వైర్లు శరీరానికి చట్టుకుని అపస్మారకంగా పడి ఉన్నాడు.
Also Read
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
Read Also: USA: పీఎం మోడీ యూఎస్ పర్యటనకు ముందు.. ఖలిస్తాన్ గ్రూపులతో వైట్హౌజ్ సమావేశం..
బాధితుడు తేనుకు చెందిన వ్యక్తి కాగా, గత 15 ఏళ్లుగా చెన్నైలోని పల్లవరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య జయరాణి, 10,8 వయసు కలిగిన ఇద్దరు పిల్లలతో అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. బాధితుడు గత రెండు నెలల క్రితం డిప్రెషన్తో మెదవాక్కంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతను పని ఒత్తిడికి గురైనట్లు చెప్పారు.
కార్తికేయ భార్య జయవాణి సోమవారం తన స్నేహితులు, పిల్లలతో కలిసి తిరునల్లారు ఆలయాని వెళ్లింది. కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. రాత్రి తిరిగి వచ్చి చూసేసరికి లోపల నుంచి గడియ వేసి ఉంది. తలుపు తెరవకపోవడంతో స్పేర్ కీతో తలుపు తెరిచింది. కార్తికేయన్ తన శరీరానికి ఎలక్ట్రిక్ వైర్లు చుట్టుకుని దానిని, విద్యుత్ బాక్సుకు కనెక్షన్ ఇచ్చి కరెంట్ షాక్తో చనిపోయాడు. తజాంబూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!