Pune: పూణెలో దారుణం.. యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం.. సెల్ఫీ తీసుకుని ఏం రాశాడంటే..!
- పూణెలో దారుణం
- యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం
- సెల్ఫీ తీసుకుని బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడొక చోట అబల దారుణానికి గురవుతూనే ఉంటోంది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్శిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి.. యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Konda Murali: ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ, మురళి భేటి.. సంచలన వ్యాఖ్యలు
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
పూణెలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్న మహిళ(22) దగ్గరకు బుధవారం రాత్రి 7:30 గంటలకు కొరియర్ డెలివరీ బాయ్ వచ్చాడు. పార్శిల్ అందజేసిన తర్వాత ఓటీపీ చెప్పమని అడిగాడు. ఇంతలో మొబైల్ తెచ్చేందుకు మహిళ లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: Nithiin : ‘తమ్ముడు’కి దూరంగా నితిన్.. కారణం ఇదే.!
ఇక స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. డెలివరీ బాయ్.. తన ముఖంపై చిల్లింగ్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని.. అనంతరం తన మొబైల్ సెల్ఫీ తీసుకుని మళ్లీ వస్తానంటూ రాసినట్లు చెప్పుకొచ్చింది.
బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పేందుకు లోపలికి వెళ్లగా.. నిందితుడు లోపలికి వెళ్లి స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు పారిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అత్యాచారం, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే తెలిపారు.
‘‘నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బ్యాంక్ కవరుతో ఒక డెలివరీ బాయ్.. 22 ఏళ్ల మహిళ ఫ్లాట్ దగ్గరకు వచ్చాడు. ఓటీపీ చెప్పేందుకు ఆమె లోపలికి వెళ్ళినప్పుడు.. అతడు తలుపు మూసేసి అత్యాచారం చేశాడు. క్రైమ్ బ్రాంచ్ నుంచి ఐదు జోనల్ బృందాలు, పది బృందాలు ఈ కేసుపై పనిచేస్తున్నాయి. రాత్రి 7.30 గంటల నుంచి ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉంది. తనిఖీ కోసం ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించాం. మహిళ ఫోన్లో ఒక సెల్ఫీ దొరికింది. మేము దానిని కూడా విశ్లేషిస్తున్నాము” అని రాజ్ కుమార్ షిండే చెప్పారు.
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!