Delhi Weather: ఢిల్లీని గజగజలాడిస్తున్న చలి.. వేసవిలో 6 ఏళ్ల నాటి రికార్డ్ బద్దలు
- ఢిల్లీని గజగజలాడిస్తున్న చలి
- ఆహ్లాదకరంగా మారిన వాతావరణం
- వేసవిలో 6 ఏళ్ల నాటి రికార్డ్ బద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. రెండ్రోజుల క్రితం వరకు ఎండలు మండిపోయాయి. బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయారు. అంతగా వేడిగాలులతో నగర వాసులు ఇబ్బందిపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయింది. దీంతో చల్లని గాలులు వీచడంతో ఉల్లాస భరితంగా మారిపోయింది.
ఎప్పుడూ మార్చి నెలలో ఢిల్లీలో తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయి నగర వాసులు.. తాజాగా చలి యూ-టర్న్ తీసుకోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. దీంతో 2020 మార్చి 8 నాటి రికార్డును మార్చి 20న ఆరేళ్ల తర్వాత బద్దలైంది. రెండు రోజుల నుంచి సాధారణం కంటే 22 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
సహజంగా మార్చి నెలలో ఢిల్లీలో తీవ్రమైన వేడి గాలులు ఉంటాయి. అధిక విద్యుత్ అవసరం ఉంటుంది. ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువ వాడడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రకృతిలో అకస్మాత్తుగా మార్పులు రావడంతో తిరిగి దుప్పట్లు, కంబళ్లు బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈసారి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ నుంచి భారతదేశం వరకు దాదాపు 1,000 కిలోమీటర్ల మేర ఒక సరళ ద్రోణిని విస్తరించి ఉంది. అంతేకాకుండా ఎత్తైన ప్రదేశాల్లోని మంచు గాలులు, అనేక చిన్న, పెద్ద తుఫాను వలయాల కలయిక వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ కారణంగానే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పర్వత ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తుండగా.. ఢిల్లీతో సహా మైదాన ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి.
ఇక మార్చి 21 నుంచి ఆకాశం క్రమంగా ఉంటుందని.. సూర్యుడు యధావిధిగా ప్రకాశిస్తాడని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 22వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభమవుతాయని.. మార్చి 23 నుంచి 26వ తేదీ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయని అంచనా వేసింది.
#WATCH | Uttar Pradesh: A layer of fog hovers over Noida this morning. Visuals from Sector 122. pic.twitter.com/oTlXtzzJ52
— ANI (@ANI) March 21, 2026
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!