PAK : ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పాక్ లో ప్రాయాణికుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తున్న విమానాన్ని పాకిస్తాన్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్ని వచ్చింది. ఓ ప్రయాణికుడికి హెల్త్ ఇష్యూ రావడంతో విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేశారు. సోమవారం ఉదయం 8.41 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నుంచి ఇండిగో 6ఈ-1736 బయల్దేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడికి ఆరోగ్య పరమైన సమస్య తలెత్తింది. పరిస్థితి విషమించడంతో విమానాన్ని కిందకు దించాల్సి వచ్చింది. దీంతో ఇండిగో విమానాన్ని పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్ట్ లో దించారు. దురదృష్టవశాత్తు విమానం ఆకాశంలోనే ఉండగానే సదరు ప్రయాణికుడి ప్రాణాలు కోల్పోయాడు. కరాచీ ఎయిర్ పోర్ట్ వైద్య సిబ్బంది ఈ మేరకు ధ్రువీకరించారు.
Also Read : Minister Harish rao: కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన మంత్రి.. వైద్య సేవలపై ఆరా
Also Read
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
ఢిల్లీ నుంచి బయల్దేరిన విమానంలో 11 గంటలకు ఖతార్ చేరుకోవాల్సి ఉంది. అయితే విమానం బయల్దేరిన కొద్ది సేపటికే అబ్దుల్లా అనే 60 ఏళ్ల నైజీరియన్ ప్రయాణికుడి ఆరోగ్యం బాగా విషమించింది. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది.. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కరాచీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే విమానం కరాచీలో ల్యాండ్ అయ్యేలోపే ఆ ప్రయాణికుడు మరణించాడు. కరాచీ వైద్య సిబ్బంది సైతం అతను మరణించినట్లు వెల్లడించారు. దాదాపు 5 గంటల పాటు విమానాన్ని కరాచీలోనే ఉంచి అధికారులు సంబంధిత ప్రక్రియలన్నీ పూర్తి చేశారు. అన్ని లాంఛనాలు పూర్తైన తర్వాత ఆ ఇండిగో విమానం తిరిగి ఢిల్లీకి బయల్దేరినట్లు అధికారులు తెలిపారు.
Also Read : Revanth Reddy: కవిత పై బండి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావు
ఈ ఘటనపై ఇండిగో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న విషయాన్ని మాత్రం ఎయిర్ లైన్ అధికారులు వెల్లడించలేదు.. ప్రస్తుతం విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులను దోహా పంపించేందుకు ప్రయత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి మరణానికి గల కారణాలపై పూర్తి స్పష్టత రాలేదు. త్వరలోనే అబ్దుల్లా మృతికి గల కారణాలు వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..