Delhi: ఢిల్లీలో దారుణం.. భార్య, ఇద్దరి పిల్లల్ని చంపిన భర్త
- ఢిల్లీలో దారుణం
- భార్య, ఇద్దరి పిల్లల్ని చంపిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. అంతకంతకు తెగిస్తున్నారు తప్ప.. మార్పు రావడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యతో సహా ఇద్దరు కూతుళ్లను అత్యంత దారుణంగా హతమార్చాడు.
ఇది కూడా చదవండి: CPI Narayana: కేంద్రం కటాక్షం లేకపోతే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు పోకుండా ఉంటారా..?
Also Read
- Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
శుక్రవారం రాత్రి ఢిల్లీలోని కరావాల్ నగర్ ప్రాంతంలో ఒక ఇంట్లో ముగ్గురు హత్యకు గురయ్యారు. భార్య, 5, 7 సంవత్సరాల వయసు కలిగిన కుమార్తెలను అత్యంత దారుణంగా తండ్రే హతమార్చాడు. భార్య జయశ్రీ(28)తో చాలా కాలంగా కుటుంబ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి గొడవలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఘర్షణలో భార్యతో పాటు పిల్లల్ని చంపేసి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యలకు ఇంకా కచ్చితమైన కారణం తెలియదని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు. మృతదేహాలను జీటీబీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించినట్లు చెప్పారు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించాయి. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: కేటీఆర్కు బండి సంజయ్ సవాల్: నా ఫోన్, సీఎం రేవంత్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు
భార్యాభర్తలు నిత్యం గొడవ పడుతుంటారని ఇరుగుపొరుగు వారు చెప్పారు. శనివారం ఉదయం 6 గంటలకు హత్యల సమాచారం తెలిసిందని పేర్కొన్నారు. తలుపు తెరిచినప్పుడు తల్లి, ఇద్దరు కుమార్తెలు మంచం మీద ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!