Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. హైద్రాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన చార్డెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకు ప్రవీణ్ సన్నిహితుడిగా ఉన్నాడు ఈడీ చార్జీషీట్ లో ప్రవీణ్ పేరు నమోదు చేసి.. ప్రవీణ్ కుమార్ పాత్రపై ఈడీ అధకారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో ప్రవీన్ నివాసంలో ఈడీ అధికారులు రూ.24లక్షలు సీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దుబాయ్ కంపెనీతో పాటు పై కంపెనీకి నిధులు మళ్లించారనే అభియోగాలపై ఈడీ విచారణ చేపట్టింది.
Read also: Pineapple Juice: పైనాపిల్ జ్యూస్తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!
Also Read
- DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రవీణ్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసులో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంతో ప్రవీణ్కుమార్కు ఏ మేరకు సంబంధం ఉందనే దానిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
Read also: Love Affair: ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న ప్రేమ..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. గతంలో ఈడీ అరెస్ట్ చేసిన దినేష్ అరోరా రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. దీంతో ఈ కేసులో సమాచారం కోసం సీబీఐ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమాచారం తీసుకున్న విషయం తెలిసిందే.. సెక్షన్ 160 కింద నోటీసులు అందజేసి కమిటీ నుంచి సమాచారం సేకరించారు. అదే రోజు కవితకు సీబీఐ అధికారులు మరో నోటీసు ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు. మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయం, బ్యాంకుల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ పేరు తెరపై రావడంతో రాజకీయ నాయకుల్లో గుబులు నెలకొంది. ఎవరుపేర్లు బయటకు వస్తాయో అన్న విషయంపై ఉత్కంఠ నెలకుంది.
Pineapple Juice: పైనాపిల్ జ్యూస్తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!
తాజావార్తలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!