Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. హైద్రాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన చార్డెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకు ప్రవీణ్ సన్నిహితుడిగా ఉన్నాడు ఈడీ చార్జీషీట్ లో ప్రవీణ్ పేరు నమోదు చేసి.. ప్రవీణ్ కుమార్ పాత్రపై ఈడీ అధకారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో ప్రవీన్ నివాసంలో ఈడీ అధికారులు రూ.24లక్షలు సీజ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దుబాయ్ కంపెనీతో పాటు పై కంపెనీకి నిధులు మళ్లించారనే అభియోగాలపై ఈడీ విచారణ చేపట్టింది.
Read also: Pineapple Juice: పైనాపిల్ జ్యూస్తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!
Also Read
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పత్రాల ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రవీణ్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసులో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంతో ప్రవీణ్కుమార్కు ఏ మేరకు సంబంధం ఉందనే దానిపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
Read also: Love Affair: ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న ప్రేమ..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. గతంలో ఈడీ అరెస్ట్ చేసిన దినేష్ అరోరా రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది. దీంతో ఈ కేసులో సమాచారం కోసం సీబీఐ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమాచారం తీసుకున్న విషయం తెలిసిందే.. సెక్షన్ 160 కింద నోటీసులు అందజేసి కమిటీ నుంచి సమాచారం సేకరించారు. అదే రోజు కవితకు సీబీఐ అధికారులు మరో నోటీసు ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు విచారించారు. మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయం, బ్యాంకుల్లోనూ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ పేరు తెరపై రావడంతో రాజకీయ నాయకుల్లో గుబులు నెలకొంది. ఎవరుపేర్లు బయటకు వస్తాయో అన్న విషయంపై ఉత్కంఠ నెలకుంది.
Pineapple Juice: పైనాపిల్ జ్యూస్తో లాభాలే కాదు.. నష్టాలు కూడా!
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..