కేజ్రీవాల్కు మళ్లీ షాక్.. అది మాత్రం కుదరదన్న లెఫ్టినెంట్ గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో రచ్చ జరగుతూనే ఉంటుంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో అది బహిర్గతం అయ్యింది.. ఏకంగా సీఎం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.. తాజాగా, కోవిడ్ నిబంధనల విషయంలో ఆప్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి మోకాలడ్డారు ఎల్జీ అనిల్ బైజాల్.. అసలు విషయానికి వస్తే.. ఢిల్లీలో కల్లోలం సృష్టించిన కోవిడ్.. ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది.. వారం రోజులుగా పాజిటివిటీ రేట్తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలనే ఆలోచనలో ఉన్నామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు.. ఇదే ఇప్పుడు ఎల్జీకి నచ్చని అంశంగా మారింది.
Read Also: ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం
Also Read
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
అయితే, కోవిడ్ విజృంభణతో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానీ, న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్, సదర్ బజార్ ట్రేడర్స్, ఇతర మార్కెట్ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలంటూ నిరసనకు దిగాయి.. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ తమ గోడువెల్లబోసుకున్నారు.. దీంతో.. వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలనే ఆలోచనకు వచ్చిన కేజ్రీవాల్ సర్కార్.. ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది.. కానీ, కేసుల సంఖ్య ఇంకా భారీగానే కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని తేల్చేశారు లెఫ్టినెంట్ గవర్నర్.. ఇదే సమయంలో 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య మరింత తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ఆప్ సర్కార్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు లెఫ్టినెంట్ గవర్నర్.
తాజావార్తలు
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
-
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
-
Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..