Delhi Shocking: గుంతలో యువకుడి మృతి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు..!
- ఢిల్లీ షాకింగ్ కేసులో దిగ్భ్రాంతికర విషయాలు..!
- చర్యలకు సిద్ధపడిన ఢిల్లీ పోలీసులు
- బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో గుంతలో పడి మరణించిన కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనక్పురిలో నడిరోడ్డుపై ఢిల్లీ జల్ బోర్డు భారీ గుంత తవ్వి.. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా.. బారికేడ్లు లేకుండా.. సైన్ బోర్డులు.. లైటింగ్ లేకుండా వదిలేశారు. కనీసం భద్రతగా సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టలేదు. దీంతో కమల్ ధ్యాని అనే యువకుడు గుంతలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబై మేయర్గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్గా సంజయ్ ఘడి ఎన్నిక
Also Read
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
అయితే ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని జనక్పురిలో 25 ఏళ్ల కమల్ ధ్యాని బైక్తో పాటు గుంతలో పడిపోవడాన్ని ఒక కుటుంబం చూసింది. వెంటనే టెంట్లో కూర్చుని ఉన్న సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చారు. ఆ గార్డ్ వెంటనే సబ్ కాంట్రాక్టర్ రాజేష్ ప్రజాపతికి సమాచారం అందించాడు. వెంటనే వచ్చి ఒక వ్యక్తి.. బైక్తో పాటు గుంతలో ఉన్నట్లు చూశాడు. కానీ రక్షించే ప్రయత్నం చేయలేదు. చూసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కనీసం పోలీసులకైనా సమాచారం ఇవ్వకుండా ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… రాజేష్తో పాటు సహా బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. రాజేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తు్న్నారు.
స్థానికుల ఆందోళన
ప్రమాద స్థలంలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.. రాత్రిపూట చీకటిగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు.
ఇక ఈ ఘటనపై ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ధ్వజమెత్తారు. ‘‘ఒక అమాయక బైకర్ లోతైన గుంతలో పడి రాత్రంతా అక్కడే ఉండి చనిపోయాడని.. నోయిడా సంఘటన నుంచి బీజేపీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదు. వారు ప్రతిరోజూ అబద్ధాలు చెబుతారు.’’ అని పేర్కొన్నారు.
Shocking !!!
सड़क में गहरे गड्ढे में एक मासूम बाइक सवार गिर कर फँस गया, रात भर पड़ा रहा और मर गया
नोएडा की घटना से दिल्ली की भाजपा सरकार ने कुछ नहीं सीखा। बस रोज़ झूठ बोला जाता है।
जनकपुरी डिस्ट्रिक्ट सेंटर, दिल्ली pic.twitter.com/4WJr1tLdiI
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 6, 2026
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!