Delhi Air Pollution: దేశంలోనే అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీనే..
- ఢిల్లీలో క్రమంగా తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..
- దేశంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఢిల్లీ..
- అత్యల్ప స్థానాల్లో కొనసాగుతున్న ఐజ్వాల్, గౌహతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నాటికి వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయి AQI 500 మార్క్ ను దాటేసింది. ఆ తర్వాత క్రమంగా కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పడుతుంది. బుధవారం ఢిల్లీ నగరంలో గాలి నాణ్యతలో స్వల్ప మెరుగుదల కనబడింది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు ఏక్యూఐ 419గా నమోదు అయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఈరోజు (గురువారం) ఉదయం 7 గంటలకు AQI ప్రమాదకర కేటగిరీ నుంచి 379కి చేరింది. అయితే, దేశంలోని 70కి పైగా నగరాలు ప్రస్తుతం వాయు కాలుష్యం నుంచి ఉపశమనం పొందుతున్నాయని చెప్పవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని పలువురు తెలిపారు.
Read Also: Kubera : ధనుష్ ‘కుబేర’ రిలీజ్ డేట్ లాక్.. శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
కాగా, ప్రస్తుతం ఢిల్లీలో గ్రేడ్ 4 ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కానీ కాలుష్యానికి హాట్స్పాట్గా మారిన ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఏరియాలో గాలి ఇప్పటికీ ప్రమాదకరమైన కేటగిరీలోనే కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తాజా సమాచారం ప్రకారం AQI 406గా రికార్డైంది. దీంతో పాటు ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఎన్సీఆర్లోని నోయిడా AQI 304గా, ఘజియాబాద్ AQI 328 నగరాలలో గాలి నాణ్యత చాలా పేలవ కేటగిరీలోకి వెళ్లింది. ఈ క్రమంలో వచ్చే శుక్ర, శనివారాల్లో వాయు కాలుష్య స్థాయిలలో మరింత మెరుగుదల కనిపిస్తుందన్నారు.
Read Also: Hyderabad: పాతబస్తీలో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమేనా?
కాగా, గురువారం ఉదయం నాటికి ఐదు ప్రధాన నగరాలు “పేలవమైన” గాలి నాణ్యతను నమోదు చేసినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. ఢిల్లీ ఈరోజు దేశంలో అత్యధిక కాలుష్య స్థాయిలను నమోదు చేసింది. ఇక, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో జైపూర్ AQI 235, చండీగఢ్ AQI 233తో ఉన్నాయి. ఐజ్వాల్ AQI 32, గౌహతి AQI 42లలో అత్యల్ప కాలుష్య స్థాయిలు ఉన్నాయని పొల్యూషన్ బోర్డు ప్రకటించింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..