Delhi Air Pollution: దేశంలోనే అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీనే..
- ఢిల్లీలో క్రమంగా తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..
- దేశంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఢిల్లీ..
- అత్యల్ప స్థానాల్లో కొనసాగుతున్న ఐజ్వాల్, గౌహతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నాటికి వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయి AQI 500 మార్క్ ను దాటేసింది. ఆ తర్వాత క్రమంగా కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పడుతుంది. బుధవారం ఢిల్లీ నగరంలో గాలి నాణ్యతలో స్వల్ప మెరుగుదల కనబడింది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు ఏక్యూఐ 419గా నమోదు అయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఈరోజు (గురువారం) ఉదయం 7 గంటలకు AQI ప్రమాదకర కేటగిరీ నుంచి 379కి చేరింది. అయితే, దేశంలోని 70కి పైగా నగరాలు ప్రస్తుతం వాయు కాలుష్యం నుంచి ఉపశమనం పొందుతున్నాయని చెప్పవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని పలువురు తెలిపారు.
Read Also: Kubera : ధనుష్ ‘కుబేర’ రిలీజ్ డేట్ లాక్.. శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
కాగా, ప్రస్తుతం ఢిల్లీలో గ్రేడ్ 4 ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కానీ కాలుష్యానికి హాట్స్పాట్గా మారిన ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఏరియాలో గాలి ఇప్పటికీ ప్రమాదకరమైన కేటగిరీలోనే కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తాజా సమాచారం ప్రకారం AQI 406గా రికార్డైంది. దీంతో పాటు ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఎన్సీఆర్లోని నోయిడా AQI 304గా, ఘజియాబాద్ AQI 328 నగరాలలో గాలి నాణ్యత చాలా పేలవ కేటగిరీలోకి వెళ్లింది. ఈ క్రమంలో వచ్చే శుక్ర, శనివారాల్లో వాయు కాలుష్య స్థాయిలలో మరింత మెరుగుదల కనిపిస్తుందన్నారు.
Read Also: Hyderabad: పాతబస్తీలో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమేనా?
కాగా, గురువారం ఉదయం నాటికి ఐదు ప్రధాన నగరాలు “పేలవమైన” గాలి నాణ్యతను నమోదు చేసినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. ఢిల్లీ ఈరోజు దేశంలో అత్యధిక కాలుష్య స్థాయిలను నమోదు చేసింది. ఇక, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో జైపూర్ AQI 235, చండీగఢ్ AQI 233తో ఉన్నాయి. ఐజ్వాల్ AQI 32, గౌహతి AQI 42లలో అత్యల్ప కాలుష్య స్థాయిలు ఉన్నాయని పొల్యూషన్ బోర్డు ప్రకటించింది.
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!