Delhi Air Pollution: దేశంలోనే అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీనే..
- ఢిల్లీలో క్రమంగా తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం..
- దేశంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఢిల్లీ..
- అత్యల్ప స్థానాల్లో కొనసాగుతున్న ఐజ్వాల్, గౌహతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నాటికి వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయి AQI 500 మార్క్ ను దాటేసింది. ఆ తర్వాత క్రమంగా కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పడుతుంది. బుధవారం ఢిల్లీ నగరంలో గాలి నాణ్యతలో స్వల్ప మెరుగుదల కనబడింది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు ఏక్యూఐ 419గా నమోదు అయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఈరోజు (గురువారం) ఉదయం 7 గంటలకు AQI ప్రమాదకర కేటగిరీ నుంచి 379కి చేరింది. అయితే, దేశంలోని 70కి పైగా నగరాలు ప్రస్తుతం వాయు కాలుష్యం నుంచి ఉపశమనం పొందుతున్నాయని చెప్పవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని పలువురు తెలిపారు.
Read Also: Kubera : ధనుష్ ‘కుబేర’ రిలీజ్ డేట్ లాక్.. శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
కాగా, ప్రస్తుతం ఢిల్లీలో గ్రేడ్ 4 ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కానీ కాలుష్యానికి హాట్స్పాట్గా మారిన ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఏరియాలో గాలి ఇప్పటికీ ప్రమాదకరమైన కేటగిరీలోనే కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తాజా సమాచారం ప్రకారం AQI 406గా రికార్డైంది. దీంతో పాటు ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఎన్సీఆర్లోని నోయిడా AQI 304గా, ఘజియాబాద్ AQI 328 నగరాలలో గాలి నాణ్యత చాలా పేలవ కేటగిరీలోకి వెళ్లింది. ఈ క్రమంలో వచ్చే శుక్ర, శనివారాల్లో వాయు కాలుష్య స్థాయిలలో మరింత మెరుగుదల కనిపిస్తుందన్నారు.
Read Also: Hyderabad: పాతబస్తీలో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమేనా?
కాగా, గురువారం ఉదయం నాటికి ఐదు ప్రధాన నగరాలు “పేలవమైన” గాలి నాణ్యతను నమోదు చేసినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. ఢిల్లీ ఈరోజు దేశంలో అత్యధిక కాలుష్య స్థాయిలను నమోదు చేసింది. ఇక, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో జైపూర్ AQI 235, చండీగఢ్ AQI 233తో ఉన్నాయి. ఐజ్వాల్ AQI 32, గౌహతి AQI 42లలో అత్యల్ప కాలుష్య స్థాయిలు ఉన్నాయని పొల్యూషన్ బోర్డు ప్రకటించింది.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!