Cash-for-Query Case: ఢిల్లీ హైకోర్టులో మహువా మొయిత్రాకి బిగ్ రిలీఫ్..
- టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట..
- డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే కేసులో సీబీఐ అభియోగపత్రం దాఖలు..
- లోక్పాల్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసి.. కేసును పునఃసమీక్షించాలని లోక్పాల్కు ఢిల్లీ హైకోర్టు సూచనలు..
Cash-for-Query Case: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ‘క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన లోక్పాల్ ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. జస్టిస్ అనిల్ క్షేతర్పాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. లోక్పాల్ మళ్లీ ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించింది. లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సంబంధిత నిబంధనలను అనుసరించి, నెల రోజుల్లో అనుమతి అంశంపై తాజా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
Read Also: Aindrita Ray: ఇంట్లో ఊపిరాడడం లేదు.. చెత్తకుప్పలు తగలబెట్టడంపై నటి ఆవేదన
Also Read
అయితే, ఈ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హిరానందానీ నుంచి నగదు, బహుమతులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు మహువా మొయిత్రాపై ఉన్నాయి. లోక్పాల్ అనుసరించిన విధానంలో స్పష్టమైన లోపాలున్నాయని మొయిత్రా తరఫు న్యాయవాది వాదించారు. సెక్షన్ 20(7) ప్రకారం అనుమతి ఇచ్చే ముందు ప్రజాసేవకుడి వ్యాఖ్యలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీబీఐ మాత్రం లోక్పాల్ విచారణలో మొయిత్రాకు పత్రాలు సమర్పించే హక్కు లేదని, కేవలం వ్యాఖ్యలు మాత్రమే ఇవ్వవచ్చని, మౌఖిక విచారణకు కూడా హక్కు లేదని వాదించింది.
Read Also: Srisailam: మల్లన్న భక్తులకు గుడ్న్యూస్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనాలపై కీలక నిర్ణయం
ఇక, ఈ వ్యవహారం తుది నిర్ణయం వచ్చే వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయడం సహా ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా సీబీఐని ఆపాలని ఎంపీ మొయిత్రా కోర్టును కోరింది. ఈ కేసులో భాగంగా సీబీఐ గత జూలైలో లోక్పాల్కు తన నివేదికను సమర్పించింది. లోక్పాల్ సూచనలతోనే మార్చి 21, 2024న అవినీతి నిరోధక చట్టం కింద మహువా మొయిత్రా, దర్శన్ హిరానందానీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే, సీబీఐ ఆరోపణల ప్రకారం, లోక్సభ లాగిన్ వివరాలను హిరానందానీకి షేర్ చేసి, తన పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించి, జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేలా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా ఆమె లంచాలు తీసుకున్నట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Bellamkonda Sreenivas: ఒక ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. మెగాస్టార్కు తొలి ఆహ్వానం!
-
Rajnikanth173 : సస్పెన్స్ వీడింది.. రజనీకాంత్ను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఎవరంటే ?
-
Ravindra Jadeja: ఆమె చెప్పిందే నిజమైంది.. ఈ అవార్డు నా ప్రియమైన మంత్రికి అంకితం!
-
Chidambaram: పోలింగ్ ప్రారంభంలోనే ఓటేసిన పి.చిదంబరం
-
Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?