Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
- ఢిల్లీలో జనం ఊపిరాడక చనిపోవాల్సి వస్తోంది..
- దేవుడే అందర్నీ కాపాడాలి..
- ఢిల్లీలో ఇప్పటికే పచ్చదనం (గ్రీన్ స్పేస్) తగ్గిపోతుంది..
- ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: దేశ రాజధాని ఢిల్లీలో పచ్చని ప్రదేశాలు వేగంగా తగ్గిపోతున్నాయని ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) పరిధిలో మిగిలి ఉన్న కొద్దిపాటి గ్రీన్ స్పేస్లను కూడా స్వాధీనం చేసుకుంటే, భవిష్యత్తులో ప్రజలు ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని జిమ్ఖానా క్లబ్, పోలో గ్రౌండ్ సహా పలు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశంపై దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. పోలో అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా, ఇప్పటికే ఢిల్లీలో పచ్చదనం గణనీయంగా తగ్గిపోతున్న పరిస్థితిని కోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా ఎన్డీఎంసీ పరిధిలో ఉన్న కొద్దిపాటి పచ్చని ప్రదేశాలు నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించే ఊపిరితిత్తుల్లా పనిచేస్తున్నాయని పేర్కొంది. అలాంటి ప్రాంతాలను కూడా ఇతర అవసరాల కోసం వినియోగిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. స్వాధీనం చేసుకోబోయే భూములపై ఎత్తైన భవనాలు లేదా ఇతర భారీ నిర్మాణాలు చేపట్టే ఆలోచన ఉందా అని ప్రశ్నించింది. పచ్చని ప్రదేశాలు తగ్గిపోతే నగరంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, ప్రజల జీవన ప్రమాణాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు పేర్కొంది.
Also Read
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
“ఎన్డీఎంసీ పరిధిలో ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు మిగిలి ఉన్న కొద్దిపాటి స్థలాలు కూడా కనుమరుగైతే, భవిష్యత్తులో అందరం ఊపిరాడక ఇబ్బంది పడాల్సి వస్తుంది. దేవుడే అందర్నీ కాపాడాలి” అంటూ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసినట్లు విచారణ సందర్భంగా వెల్లడైంది. ఈ కేసుపై తదుపరి విచారణలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని కోర్టుకు వివరించే అవకాశం ఉంది. రాజధానిలో పచ్చదనం పరిరక్షణ, నగరాభివృద్ధి మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్న అంశంపై ఈ కేసు కీలకంగా మారే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?