Dhruv Rathee: రాముడు-సీతలపై వ్యాఖ్యలు.. ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపుపై హైకోర్టు డెడ్లైన్
- ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపు అంశంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.
- 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీకి ఆదేశం.
- కోర్టు ఆదేశాలను పాటించకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిక.
- వీడియోలో హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Rathee: హిందూ దేవీదేవతలు శ్రీరాముడు-సీతాదేవిపై యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చేసిన వీడియోపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీరాముడు, సీత, శ్రీ కృష్ణుడు మాంసం, మద్యం సేవించారని ధ్రువ్ రాఠీ ఒక వీడియోలో కామెంట్స్ చేశాడు. ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ప్రభుత్వ గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
మార్చి 21 ధ్రువ్ రాఠీ చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్లో ‘‘Can Hindus Eat Beef? | Kerala Story 2 Exposed’’ పేరుతో వీడియో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో హిందూ దేవతలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతా దేవి మాసం తిన్నారని, మద్యం సేవించారని ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు మతపరమైన భావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తమైంది.
Also Read
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
విచారణ సందర్భంగా, కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చేతన్ శర్మ, యూట్యూబ్ తగిన జాగ్రత్తలు తీసుకుని, అభ్యంతరకరమైన, విద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్గా ఆరోపించబడిన దానిని వెంటనే తొలగించి ఉండాల్సిందని వాదించారు. ధ్రువ్ రాఠీ చేసని కంటెంట్ హానికరమైందిగా, విభజనను కలిగించేదిగా కోర్టుకు తెలిపారు. వీడియోను తొలగిస్తామని గూగుల్ కోర్టుకు తెలియజేయాలని, లేదా డివిజన్ బెంచ్ చేసిన పరిశీలనల ఆధారంగా కోర్టు ముందుకు సాగవచ్చని ఆయన వాదించారు.
గూగుల్ తరుఫున హాజరైన న్యాయవాది పిటిషనర్కు ఇప్పటికే తమ సమాధానం అందజేశామని, ఈ అంశంపై గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ ముందు అప్పీల్ కూడా దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న తర్వాత జస్టిస్ స్వర్ణ కాంత శర్మ, అప్పీల్ పై 15 రోజుల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీని ఆదేశించారు. ఈ పిటిషన్ను అడ్వకేట్ అమితా సచ్దేవా దాఖలు చేశారు. ధ్రువ్ రాఠీ మార్చి 21న అప్లోడ్ చేసిన వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాలని ఆమె కోరారు.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?