Delhi: ఆ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్రోల్ బైకులు, సీఎన్జీ ఆటోలు బ్యాన్..?
- ఢిల్లీలో విపరీతంగా పెరుగుతున్న వాయు కాలుష్యం..
- ఈవీ పాలసీ 2.0 అమలుతో పెట్రోల్ బైకులు, సీఎన్జీ ఆటోలు బ్యాన్?..
- వచ్చే ఏడాది నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాలు, సీఎన్జీ ఆటోలు బ్యాన్..
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ‘ఈవీ పాలసీ 2.0’ను అమలుచేసేందుకు రెడీ అవుతుంది. దీనికి కేబినెట్ నుంచి ఆమోదం లభించిన తర్వాత.. పెట్రోల్, డీజిల్ సీఎన్జీ వెహికిల్స్ ను పూర్తిస్థాయిలో నిషేధించడానికి ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈవీ పాలసీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత.. వచ్చే సంవత్సరం నుంచే పెట్రోల్, డీజీల్, సీఎన్జీ వాహనాలపై బ్యాన్ విధించే అవకాశం ఉంది. 2027 డిసెంబర్ 31 నాటికి ఢిల్లీలో వందశాతం ఎలక్ట్రిక్ వాహనాలను నడపాలనే ఉద్దేశ్యంతోనే.. బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సీఎన్జీ బైకులు, ఆటోలను కూడా నిషేదించనున్నట్లు టాక్. ఫ్యూయెల్ కార్లను ఎంత వరకు నిషేధిస్తారు అనే దానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.
Read Also: Siddu Jonnalagadda : ‘జాక్’ ఓవర్శీస్ టాక్
Also Read
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
ఇక, 2025 ఆగస్టు 15 నుంచి ఢిల్లీలో కొత్త సీఎన్జీ ఆటో రిక్షా రిజిస్ట్రేషన్లను, రెన్యువల్స్ అనుమతించబోమని ఇప్పటికే తెలిపారు. కేవలం ఎలక్ట్రిక్ ఆటోల రెన్యువల్స్, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి లభించనుంది. ఆ తరువాత దశల వారీగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలను తొలగించనున్నారు. వీటి స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. కాగా, బైకులు, ఆటోలు మాత్రమే కాకుండా.. ఢిల్లీలో చెత్తను సేకరించే వాహనాలు, సిటీ బస్సులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా అప్ గ్రేడ్ చేయాలని పేర్కొన్నారు. ఇక, మార్చి 31వ తేదీతో ముగిసిన ‘ఈవీ పాలసీ’ని ఢిల్లీ సర్కార్ మరో 15 రోజులు పొడిగించింది. ఆ తరువాత ఈవీ పాలసీ 2.0 అమలులోకి తీసుకు రానుంది. ఫ్యూయెల్ వెహికిల్స్.. ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడమే ఈ కొత్త పాలసీ టార్గెట్ అని అధికారులు తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!