Delhi: ఆ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్రోల్ బైకులు, సీఎన్జీ ఆటోలు బ్యాన్..?
- ఢిల్లీలో విపరీతంగా పెరుగుతున్న వాయు కాలుష్యం..
- ఈవీ పాలసీ 2.0 అమలుతో పెట్రోల్ బైకులు, సీఎన్జీ ఆటోలు బ్యాన్?..
- వచ్చే ఏడాది నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాలు, సీఎన్జీ ఆటోలు బ్యాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ‘ఈవీ పాలసీ 2.0’ను అమలుచేసేందుకు రెడీ అవుతుంది. దీనికి కేబినెట్ నుంచి ఆమోదం లభించిన తర్వాత.. పెట్రోల్, డీజిల్ సీఎన్జీ వెహికిల్స్ ను పూర్తిస్థాయిలో నిషేధించడానికి ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈవీ పాలసీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత.. వచ్చే సంవత్సరం నుంచే పెట్రోల్, డీజీల్, సీఎన్జీ వాహనాలపై బ్యాన్ విధించే అవకాశం ఉంది. 2027 డిసెంబర్ 31 నాటికి ఢిల్లీలో వందశాతం ఎలక్ట్రిక్ వాహనాలను నడపాలనే ఉద్దేశ్యంతోనే.. బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సీఎన్జీ బైకులు, ఆటోలను కూడా నిషేదించనున్నట్లు టాక్. ఫ్యూయెల్ కార్లను ఎంత వరకు నిషేధిస్తారు అనే దానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.
Read Also: Siddu Jonnalagadda : ‘జాక్’ ఓవర్శీస్ టాక్
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఇక, 2025 ఆగస్టు 15 నుంచి ఢిల్లీలో కొత్త సీఎన్జీ ఆటో రిక్షా రిజిస్ట్రేషన్లను, రెన్యువల్స్ అనుమతించబోమని ఇప్పటికే తెలిపారు. కేవలం ఎలక్ట్రిక్ ఆటోల రెన్యువల్స్, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి లభించనుంది. ఆ తరువాత దశల వారీగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలను తొలగించనున్నారు. వీటి స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. కాగా, బైకులు, ఆటోలు మాత్రమే కాకుండా.. ఢిల్లీలో చెత్తను సేకరించే వాహనాలు, సిటీ బస్సులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా అప్ గ్రేడ్ చేయాలని పేర్కొన్నారు. ఇక, మార్చి 31వ తేదీతో ముగిసిన ‘ఈవీ పాలసీ’ని ఢిల్లీ సర్కార్ మరో 15 రోజులు పొడిగించింది. ఆ తరువాత ఈవీ పాలసీ 2.0 అమలులోకి తీసుకు రానుంది. ఫ్యూయెల్ వెహికిల్స్.. ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడమే ఈ కొత్త పాలసీ టార్గెట్ అని అధికారులు తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..