Covid 19: హస్తినను మళ్లీ కలవరపెడుతోన్న కరోనా.. అప్రమత్తమైన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేట్ 2 శాతం దాటగా… వారం రోజుల్లోనే హోం ఐసోలేషన్ కేసులు దాదాపు 48శాతం పెరిగాయి. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కువ కేసులు బయటపడుతుండటం గవర్నమెంట్ అప్రమత్తమైంది. ఢిల్లీలో వరుసగా కేసులు పెరుగుతున్నాయి. గురువారం 325 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1న 0.57శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు గురువారానికి 2.39 శాతానికి చేరింది. శుక్రవారం నాడు 366 కొత్త కేసులు నమోదు కాగా… యాక్టివ్ కేసుల సంఖ్య 1072కు పెరిగింది. అదే టైమ్ లో హోం ఐసోలేషన్ కేసులు కూడా ఎక్కువగానే పెరిగాయి. ఏప్రిల్ 8న ఢిల్లీలో 388 మంది కరోనా పేషెంట్లు హోం ఐసోలేషన్లో ఉండగా… 14వ తేదీ నాటికి 48శాతం పెరిగి 574కు చేరినట్లు గవర్నమెంట్ లెక్కలు చెబుతున్నాయి.
Also Read
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
అయితే ఎవరూ చనిపోకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. ఎక్కువ కేసులు స్కూళ్లలోనే వస్తుండడంతో… కేజ్రీవాల్ ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా బయటడిన క్లాస్ రూమ్లను తాత్కాలికంగా మూసేయాలని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదేశించారు. ఎక్కువ కేసులు వస్తే మొత్తం స్కూల్కు సెలవు ఇవ్వొచ్చని చెప్పారు. కరోనాపై ఈ నెల 20న సమీక్ష జరుపుతామన్నారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నప్పటికీ… దేశవ్యాప్తంగా మాత్రం పెద్దగా మార్పులేదు. గురువారం నాడు దేశవ్యాప్తంగా 949 కేసులు రాగా… ఆరుగురు కరోనాతో చనిపోయారు. డెయిలీ పాజిటివిట రేట్ 0.26శాతంగా ఉంది. కరోనా కారణంగా గత రెండేళ్లు దేశంలో చదువులు సరిగా సాగలేదు. ఈ విద్యాసంవత్సరమే పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరచుకున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ ఢిల్లీలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!