Covid 19: హస్తినను మళ్లీ కలవరపెడుతోన్న కరోనా.. అప్రమత్తమైన సర్కార్
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేట్ 2 శాతం దాటగా… వారం రోజుల్లోనే హోం ఐసోలేషన్ కేసులు దాదాపు 48శాతం పెరిగాయి. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కువ కేసులు బయటపడుతుండటం గవర్నమెంట్ అప్రమత్తమైంది. ఢిల్లీలో వరుసగా కేసులు పెరుగుతున్నాయి. గురువారం 325 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1న 0.57శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు గురువారానికి 2.39 శాతానికి చేరింది. శుక్రవారం నాడు 366 కొత్త కేసులు నమోదు కాగా… యాక్టివ్ కేసుల సంఖ్య 1072కు పెరిగింది. అదే టైమ్ లో హోం ఐసోలేషన్ కేసులు కూడా ఎక్కువగానే పెరిగాయి. ఏప్రిల్ 8న ఢిల్లీలో 388 మంది కరోనా పేషెంట్లు హోం ఐసోలేషన్లో ఉండగా… 14వ తేదీ నాటికి 48శాతం పెరిగి 574కు చేరినట్లు గవర్నమెంట్ లెక్కలు చెబుతున్నాయి.
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
అయితే ఎవరూ చనిపోకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. ఎక్కువ కేసులు స్కూళ్లలోనే వస్తుండడంతో… కేజ్రీవాల్ ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా బయటడిన క్లాస్ రూమ్లను తాత్కాలికంగా మూసేయాలని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదేశించారు. ఎక్కువ కేసులు వస్తే మొత్తం స్కూల్కు సెలవు ఇవ్వొచ్చని చెప్పారు. కరోనాపై ఈ నెల 20న సమీక్ష జరుపుతామన్నారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నప్పటికీ… దేశవ్యాప్తంగా మాత్రం పెద్దగా మార్పులేదు. గురువారం నాడు దేశవ్యాప్తంగా 949 కేసులు రాగా… ఆరుగురు కరోనాతో చనిపోయారు. డెయిలీ పాజిటివిట రేట్ 0.26శాతంగా ఉంది. కరోనా కారణంగా గత రెండేళ్లు దేశంలో చదువులు సరిగా సాగలేదు. ఈ విద్యాసంవత్సరమే పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరచుకున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ ఢిల్లీలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!