Covid 19: హస్తినను మళ్లీ కలవరపెడుతోన్న కరోనా.. అప్రమత్తమైన సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేట్ 2 శాతం దాటగా… వారం రోజుల్లోనే హోం ఐసోలేషన్ కేసులు దాదాపు 48శాతం పెరిగాయి. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కువ కేసులు బయటపడుతుండటం గవర్నమెంట్ అప్రమత్తమైంది. ఢిల్లీలో వరుసగా కేసులు పెరుగుతున్నాయి. గురువారం 325 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1న 0.57శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు గురువారానికి 2.39 శాతానికి చేరింది. శుక్రవారం నాడు 366 కొత్త కేసులు నమోదు కాగా… యాక్టివ్ కేసుల సంఖ్య 1072కు పెరిగింది. అదే టైమ్ లో హోం ఐసోలేషన్ కేసులు కూడా ఎక్కువగానే పెరిగాయి. ఏప్రిల్ 8న ఢిల్లీలో 388 మంది కరోనా పేషెంట్లు హోం ఐసోలేషన్లో ఉండగా… 14వ తేదీ నాటికి 48శాతం పెరిగి 574కు చేరినట్లు గవర్నమెంట్ లెక్కలు చెబుతున్నాయి.
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
అయితే ఎవరూ చనిపోకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. ఎక్కువ కేసులు స్కూళ్లలోనే వస్తుండడంతో… కేజ్రీవాల్ ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా బయటడిన క్లాస్ రూమ్లను తాత్కాలికంగా మూసేయాలని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదేశించారు. ఎక్కువ కేసులు వస్తే మొత్తం స్కూల్కు సెలవు ఇవ్వొచ్చని చెప్పారు. కరోనాపై ఈ నెల 20న సమీక్ష జరుపుతామన్నారు. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నప్పటికీ… దేశవ్యాప్తంగా మాత్రం పెద్దగా మార్పులేదు. గురువారం నాడు దేశవ్యాప్తంగా 949 కేసులు రాగా… ఆరుగురు కరోనాతో చనిపోయారు. డెయిలీ పాజిటివిట రేట్ 0.26శాతంగా ఉంది. కరోనా కారణంగా గత రెండేళ్లు దేశంలో చదువులు సరిగా సాగలేదు. ఈ విద్యాసంవత్సరమే పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరచుకున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ ఢిల్లీలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!