Delhi Car Blast: ఒక దుకాణంపై పడ్డ శరీర భాగాలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు
- ఒక దుకాణంపై పడ్డ శరీర భాగాలు
- స్వాధీనం చేసుకున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ బ్లాస్ట్పై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా పేలుడు జరిగిన 300 మీటర్ల దూరంలోని ఒక షాపుపై ఒక వ్యక్తి శరీర భాగాలు స్వాధీనం చేసుకున్నారు. లజ్పత్రాయ్ మార్కెట్లోని ఒక దుకాణంపై తెగిపోయిన చేయిను రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం శరీర భాగాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం అధికారుల పంపించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: వెలుగులోకి సంచలన ఫొటోలు.. దొరికిన ఉమర్ మూడో కారు.. ఎక్కడుందంటే..!
Also Read
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. గురువారం తెల్లవారుజామున ఎల్ఎన్ జేపీ ఆస్పత్రిలో గాయపడిన వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 13కు చేరింది. ఇంకా పలువురు ఆస్పత్రిలోనే కోలుకుంటున్నారు. ఇక బాధితులను బుధవారం ప్రధాని మోడీ పరామర్శించారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: రేపే బీహార్ ఫలితాలు.. ‘టైగర్ జిందా హై’తో వెలసిన పోస్టర్లు
ఇదిలా ఉంటే ప్రధానంగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్ర కుట్ర జరిగినట్లుగా గుర్తించారు. దేశ వ్యాప్తంగా నాలుగు నగరాల్లో భారీ దాడులకు కుట్ర పన్నినట్లుగా తేలింది. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్లు ఉమర్ నబీ, ముజమ్మిల్ డైరీల్లో ఈ ఉగ్ర ప్రణాళికను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ ఉగ్ర కుట్రకు యూనివర్సిటీలోని 17వ నెంబర్ భవనాన్ని ఉపయోగించుకున్నట్లుగా కనిపెట్టారు. ఈ భవనంలో ముజమ్మిల్కు 13వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లుగా తేలింది. గదిలో కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్డ్రైవ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఉమర్కు 4వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచి కూడా మూడు డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీల్లో పలువురి పేర్లు ఉన్నాయి. అలాగే దాడులకు సంబంధించిన ప్రణాళికలు కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. ఒకేసారి దాడులు జరిపేందుకు మూడు కార్లు కొనుగోలు చేశారు. ఇందులో ఒక కారు ఎర్రకోట దగ్గర పేలిపోయింది. ఇంకో కారు ఫరీదాబాద్లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందులో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
మొత్తం 8 మందితో దేశ వ్యాప్తంగా దాడులు చేసేందుకు సిద్ధం చేసుకున్నట్లు డైరీల నుంచి సేకరించిన సమాచారంతో అధికారులు కనిపెట్టారు. ఎనిమిది మందిలో ఉమర్, ముజమ్మిల్, డాక్టర్ అదిల్, డాక్టర్ షాహీన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. దాడుల బాధ్యతలను పూర్తిగా ఉమర్కు అప్పగించినట్లు సమాచారం. ఈ ప్రణాళిక అమలు కోసం మొత్తం రూ.20 లక్షల వరకు నిధులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ డబ్బుతోనే అన్ని పరికరాలు సేకరించి.. పేలుడు పదార్థాలు సేకరించినట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..