Delhi Car Blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్లో అమ్మోనియం నైట్రేట్ కన్నా శక్తివంతమైంది వాడారు.!
- ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్లో కొత్త విషయాలు..
- పేలుడుకు అమ్మోనియం నైట్రేట్తో పాటు మరో శక్తివంతమైన పదార్థం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్ కేసులో విచారణ ముమ్మరమైంది. ఈ కేసును ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేతిలోకి తీసుకుంది. పలువురు డాక్టర్ ఉగ్రవాదులతో పాటు మరికొందరిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ బాంబులో ఏ పదార్థం వాడారో తెలుసుకునేందుకు నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ బృందం పరీక్షిస్తోంది. ముందుగా, ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్ మాత్రమే వాడినట్లు ప్రాథమికంగా అనుకున్నారు. అయితే, ఇదే కాకుండా హైగ్రేడ్ పేలుడు పదార్థాలు కూడా వాడినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పేలుడు ప్రాంతం నుంచి సేకరించిన నమూనాల్లో ఒకటి అమ్మోనియం నైట్రేట్ కన్నా శక్తివంతమైందిగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. పేలుడు పదార్థాలతో సహా 40కి పైగా నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారు. ప్రాథమిక విశ్లేషణ ప్రకరాం, పేలుడులో ఒకటి అమ్మోనియం నైట్రేట్ అని, రెండోది దీని కన్నా శక్తివంతమైందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
అమ్మోనియం నైట్రేట్, ఎరువుల్లో వాడే ఈ పదార్థం తెల్లని స్పటికా రూపంలో ఉంటుంది. ఇది శక్తివంతమైన ఆక్సిడైజర్గా పనిచేస్తుంది. సరైన పరిస్థితుల్లో ఇది పేలుడుకు కారణమవుతుంది. దీని ఫలితంగా అధిక ఉష్ణోగ్రత, మంటలు వ్యాపిస్తాయి. అమ్మోనియం నైట్రేట్ స్వయంగా పేలదు, దీనికి కొంత శాతం వేరే పదార్థాలను కలుపుతారు. ఢిల్లీ పేలుడులో దీనికి ఫ్యూయల్ ఆయిల్ కలిపారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 20కి పైగా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కొంత మంది బాధితుల ఊపిరితిత్తులు, చెవులు, పొత్తికడుపు దెబ్బతిన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు చెబుతున్నాయి. మరికొంది ఎముకలు చాలా చోట్ల విరిగాయి. ఈ కేసులో డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, అదీల్ రాథర్ లను అరెస్ట్ చేశారు. పేలుడుకు మరో డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పాల్పడినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!