Delhi Car Blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్లో అమ్మోనియం నైట్రేట్ కన్నా శక్తివంతమైంది వాడారు.!
- ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్లో కొత్త విషయాలు..
- పేలుడుకు అమ్మోనియం నైట్రేట్తో పాటు మరో శక్తివంతమైన పదార్థం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్ కేసులో విచారణ ముమ్మరమైంది. ఈ కేసును ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేతిలోకి తీసుకుంది. పలువురు డాక్టర్ ఉగ్రవాదులతో పాటు మరికొందరిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ బాంబులో ఏ పదార్థం వాడారో తెలుసుకునేందుకు నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ బృందం పరీక్షిస్తోంది. ముందుగా, ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్ మాత్రమే వాడినట్లు ప్రాథమికంగా అనుకున్నారు. అయితే, ఇదే కాకుండా హైగ్రేడ్ పేలుడు పదార్థాలు కూడా వాడినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పేలుడు ప్రాంతం నుంచి సేకరించిన నమూనాల్లో ఒకటి అమ్మోనియం నైట్రేట్ కన్నా శక్తివంతమైందిగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. పేలుడు పదార్థాలతో సహా 40కి పైగా నమూనాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారు. ప్రాథమిక విశ్లేషణ ప్రకరాం, పేలుడులో ఒకటి అమ్మోనియం నైట్రేట్ అని, రెండోది దీని కన్నా శక్తివంతమైందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
Also Read
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
అమ్మోనియం నైట్రేట్, ఎరువుల్లో వాడే ఈ పదార్థం తెల్లని స్పటికా రూపంలో ఉంటుంది. ఇది శక్తివంతమైన ఆక్సిడైజర్గా పనిచేస్తుంది. సరైన పరిస్థితుల్లో ఇది పేలుడుకు కారణమవుతుంది. దీని ఫలితంగా అధిక ఉష్ణోగ్రత, మంటలు వ్యాపిస్తాయి. అమ్మోనియం నైట్రేట్ స్వయంగా పేలదు, దీనికి కొంత శాతం వేరే పదార్థాలను కలుపుతారు. ఢిల్లీ పేలుడులో దీనికి ఫ్యూయల్ ఆయిల్ కలిపారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 20కి పైగా మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి కొంత మంది బాధితుల ఊపిరితిత్తులు, చెవులు, పొత్తికడుపు దెబ్బతిన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు చెబుతున్నాయి. మరికొంది ఎముకలు చాలా చోట్ల విరిగాయి. ఈ కేసులో డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, అదీల్ రాథర్ లను అరెస్ట్ చేశారు. పేలుడుకు మరో డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పాల్పడినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!