Delhi Car Blast: 26/11 తరహా దాడులకు కుట్ర, 200పైగా ఐఈడీలో విధ్వంసానికి ప్లాన్..
- ముంబై తరహా దాడులకు ఉగ్ర కుట్ర..
- ఢిల్లీ కారు బాంబ్ కేసులో సంచలన విషయాలు..
- 200కు పైగా ఐఈడీలతో విధ్వంసానికి ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగే కొద్దీ డొంక కదులుతోంది. 26/11 ముంబై దాడుల తరహాలో ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో దాడుల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లో దాడులు చేయాలని కుట్ర చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నవంబర్ 26, 2008న ముంబై దాడుల సమయంలో, తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, లియోపోల్డ్ హాస్పిటల్తో సహా 12 ప్రదేశాలలో పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ఇలాగే ఢిల్లీ వ్యాప్తంగా దాడులకు నిందితులు పథకం రచించారు.
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
Read Also: Onion and Garlic: భారత్ లో పూర్తిగా ఉల్లి, వెల్లుల్లిని నిషేదించిన ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా..
జనవరి నుంచే ఢిల్లీ దాడులకు కుట్ర జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్తో సంబంధాలు ఉన్న ఉగ్రవాదులు మాడ్యూల్ నెలల తరబడి దాడులకు ప్రణాళికలు రచించింది. ఢిల్లీలో పాటు గురుగ్రామ్, ఫరీదాబాద్లోని హై ప్రొఫైల్ ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని, ఏకంగా 200 శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ (IEDలు) బాంబుల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడానికి కుట్ర పన్నినట్లు తేలింది. జమ్మూ కాశ్మీర్ పుల్వామా, షోపియాన్, అనంత్ నాగ్లకు చెందిన కొంతమంది డాక్టర్లను ఉగ్రవాదులుగా మార్చినట్లు తెలుస్తోంది. వీరి ఉద్యోగాల కారణంగా ఎవరికి అనుమానం రాకుండా వీరిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. దీంతో వీరంత ఫరీదాబాద్ స్థావరంగా ఉగ్రదాడులకు తెరతీశారు.
వైద్యులు కావడంతో అనుమానం రాకుండా పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. రూంలను అద్దెకు తీసుకుని పేలుడు పదార్థాలను నిల్వ చేశారు. ముగ్గురు డాక్టర్లు- షాహీల్ సయీద్, ముజమ్మిల్ షకీల్ గనాలే, అదీల్ రాథర్లో పాటు సోమవారం ఆత్మాహుతి పేలుడులో మరణించిన డాక్టర్ ఉమర్ నబీ కూడా ఈ ప్లాన్లో కీలకంగా పనిచేశారు. ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సటీతో వీరందరికి సంబంధం ఉంది. ఉమర్ నబీ సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో ఐ20 కారులో పేలుడు పదార్థాలు తీసుకువచ్చి పేల్చాడు. ఈ దాడిలో 12 మంది మరణించారు. దీనికి ముందు దీపావళి రోజు రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేయాలని ప్లాన్ చేశారు. కానీ దానిని అమలు చేయలేదు.
తాజావార్తలు
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి