కాంట్రావర్సీ క్వీన్ పై మరోసారి దూమారం చెలరేగుతుంది. తాజాగా ఆమె గాంధీజీ పై చేసిన వ్యాఖ్యల పై పలువురు ప్రముఖులు తప్పుప డుతున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు నోరు పారేసుకున్న కంగనారనౌత్ ఈ సారి చేసిన వ్యాఖ్యలతో దేశం పరువు పోతుందని ఢీల్లీ బీజేపీ ప్రతినిధి నిఘత్ అబ్బాస్ అన్నారు. కంగనా రనౌత్ మహాత్మాగాంధీజీ పై హేళనగా చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు.
ఈ సందర్భంగా నిఘత్ అబ్బాస్ మాట్లాడుతూ.. విద్వేషాన్ని పెంచే వ్యాఖ్యలు ఎవ్వరికి మంచి కావని ఆమె చెప్పారు. గాంధీజీ బోధనలతో స్ఫూర్తి పొందిన వారిలో నరేంద్ర మోడీ కూడా ఉన్నారని, గాంధీకి వ్య తిరేకంగా చేసే ప్రకటనల వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోతుందని ఆమె అన్నారు. గాంధీ ఆలోచనలు బీజేపీని సజీవంగా నిలుపుతున్నాయని నిఘత్ అన్నారు. ఆయన ఆలోచనలతోనే ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తి పొందారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని కంగనారనౌత్ను ఉద్దేశించి నిఘత్ అన్నారు.