Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Threat to Delhi BJP HQ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) మార్గ్లోని భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర కార్యాలయంతో పాటు సమీపంలోని కీలక ప్రభుత్వ సంస్థలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమై బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను, పారామిలటరీ దళాలను మోహరించాయి.
ఆత్మాహుతి దాడులు, కారు బాంబులతో కుట్ర!
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఈసారి అత్యంత విధ్వంసకర పద్ధతులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడులు, కారు బాంబు పేలుళ్లు, కాల్పులకు తెగబడటం లేదా ఐఈడీలను అమర్చడం వంటి కుట్రలు పన్నుతున్నట్లు హెచ్చరికలు అందాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే స్పందించేలా స్పెషల్ ఫోర్స్ రెడీగా ఉంది.
Also Read
- సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
ఢిల్లీని వణికించిన గత దాడులు..
దేశ రాజధాని ఎప్పుడూ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉందనడానికి గతంలో జరిగిన దాడులే నిదర్శనం. నిఘా వర్గాలు ఇప్పుడు అప్రమత్తం కావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే.. డిసెంబర్ 13న ప్రజాస్వామ్య దేవాలయంలాగా భావించే పార్లమెంట్పై ఉగ్రవాదులు ఆటోమేటిక్ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో భద్రతా బలగాలు ఉగ్రవాదులను హతమార్చినప్పటికీ, పలువురు జవాన్లు వీరమరణం పొందారు. 2005లో దీపావళి, ఈద్ పండుగలకు ముందు సరోజినీ నగర్, పహార్గంజ్, గోవింద్పురిలలో చోటుచేసుకున్న వరుస పేలుళ్లు ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి. 2011లో ఢిల్లీ హైకోర్టు గేట్ నంబర్ 5 వెలుపల జరిగిన భారీ పేలుడులో అనేకమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
2008లో ఢిల్లీ నగరం నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్ వంటి కీలక వాణిజ్య ప్రాంతాల్లో ఒకదాని వెనుక ఒకటిగా జరిగిన పేలుళ్లు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. 2010లో జామా మసీదులో విదేశీ పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. గతేడాది నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో పలు వాహనాలు ధ్వంసం కావడమే కాకుండా, సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కార్యాలయానికి ముప్పు ఉందన్న వార్త ఢిల్లీ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ప్రస్తుతం డీడీయూ మార్గ్ పరిసరాల్లోని అణువణువూ గాలిస్తూ, అనుమానిత వ్యక్తులపై అధికారులు నిఘా పెంచారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?