Wayanad Landslide: వయనాడ్ ఘటనలో 297కి చేరిన మృతుల సంఖ్య.. 450 వరకు ఇళ్లు, భవనాలు ధ్వంసం
- వయనాడ్ ఘటనలో 297కి చేరిన మృతుల సంఖ్య..
- 450 వరకు ఇళ్లు.. భవనాలు ధ్వంసం..
Wayanad Landslide: కేరళ వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 297కి చేరింది. గురువారం వాయనాడ్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో, మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్లో ప్రాణాలతో బయటడిన వారందర్ని రక్షించినట్లు అంచనా వేశారు. ఇంకా 29 మంది చిన్నారులు అదృశ్యంగా ఉన్నారు. ముండక్కై, అట్టమాల ప్రాంతాల్లో సజీవంగా చిక్కుకునే అవకాశం లేదని కేరళ-కర్ణాటక సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ వీటీ మాథ్యూ సమావేశంలో తెలిపారు. 500 మంది ఆర్మీ సిబ్బంది ముండక్కై, చురల్మాల ప్రాంతంలో వెతకడానికి అందుబాటులో ఉన్నారు. ఈ ప్రాంతాలకు వంతెనను నిర్మించాలని ఆర్మీ లక్ష్యంగా పెట్టుకుంది. రేపు మధ్యాహ్నానికి బెలీ బ్రిడ్జి పూర్తి కానుంది.
Read Also: Lebanon-Israel War: తక్షణమే లెబనాన్ను విడిచి పెట్టాలని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
కొండచరియలు విరిగిపడిన ముండక్కై, వెల్లరమల ప్రాంతాల్లో రెండు పాఠశాలలు, మెప్రాడి ప్రాంతంలోని రెండు పాఠశాల్లో మొత్తం 29 మంది విద్యార్థులు గల్లంతైనట్లు డీడీఈ శశీంద్రవ్యాస్ వీఏ తెలిపారు. కొండచరియలు విరిగిన పరిడి ప్రాంతంలో ఈ రెండు పాఠశాలలు ఉన్నాయి. వేలరమల పాఠశాలలో 11 మంది చిన్నారులు తప్పిపోయారు. గల్లంతైన 29 మంది చిన్నారుల్లో నలుగురి మృతదేహాలను గుర్తించారు. పిల్లలందరి వివరాలను సేకరిస్తున్నారు.
మృతదేహం దొరికిన మూడు నిమిషాల్లోనే పోస్టుమార్టం నిర్వహిస్తారు. శిబిరాల్లో నివసిస్తు్న్న ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఇన్ఫెక్షన్లకు కారమయ్యే అవకాశం ఉండటంతో జంతువుల మృతదేహాలను తక్షణమే తొలగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు సహా 450 భవనాలు దెబ్బతిన్నాయని ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ ఎ కౌశిగన్ తెలిపారు. అనాథ శవాలకు ప్రోటోకాల్ ప్రకారం దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక అధికారి సాంబశివరావు తెలిపారు. 129 మొబైల్ ఫ్రీజర్లు అందుబాటులో ఉన్నాయి, వీటిలో 59 ఉపయోగించబడుతున్నాయి. మొబైల్ ఫ్రీజర్లను అందించేందుకు కర్ణాటక సిద్ధమైంది. గుర్తించని మృతదేహాలను దహనం చేయడంపై గ్రామ పంచాయతీలే నిర్ణయం తీసుకుంటాయి
తాజావార్తలు
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
-
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!