Wayanad Landslide: వయనాడ్ ఘటనలో 297కి చేరిన మృతుల సంఖ్య.. 450 వరకు ఇళ్లు, భవనాలు ధ్వంసం
- వయనాడ్ ఘటనలో 297కి చేరిన మృతుల సంఖ్య..
- 450 వరకు ఇళ్లు.. భవనాలు ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad Landslide: కేరళ వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 297కి చేరింది. గురువారం వాయనాడ్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన అధికారిక సమావేశంలో, మూడు రోజుల రెస్క్యూ ఆపరేషన్లో ప్రాణాలతో బయటడిన వారందర్ని రక్షించినట్లు అంచనా వేశారు. ఇంకా 29 మంది చిన్నారులు అదృశ్యంగా ఉన్నారు. ముండక్కై, అట్టమాల ప్రాంతాల్లో సజీవంగా చిక్కుకునే అవకాశం లేదని కేరళ-కర్ణాటక సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ వీటీ మాథ్యూ సమావేశంలో తెలిపారు. 500 మంది ఆర్మీ సిబ్బంది ముండక్కై, చురల్మాల ప్రాంతంలో వెతకడానికి అందుబాటులో ఉన్నారు. ఈ ప్రాంతాలకు వంతెనను నిర్మించాలని ఆర్మీ లక్ష్యంగా పెట్టుకుంది. రేపు మధ్యాహ్నానికి బెలీ బ్రిడ్జి పూర్తి కానుంది.
Read Also: Lebanon-Israel War: తక్షణమే లెబనాన్ను విడిచి పెట్టాలని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
కొండచరియలు విరిగిపడిన ముండక్కై, వెల్లరమల ప్రాంతాల్లో రెండు పాఠశాలలు, మెప్రాడి ప్రాంతంలోని రెండు పాఠశాల్లో మొత్తం 29 మంది విద్యార్థులు గల్లంతైనట్లు డీడీఈ శశీంద్రవ్యాస్ వీఏ తెలిపారు. కొండచరియలు విరిగిన పరిడి ప్రాంతంలో ఈ రెండు పాఠశాలలు ఉన్నాయి. వేలరమల పాఠశాలలో 11 మంది చిన్నారులు తప్పిపోయారు. గల్లంతైన 29 మంది చిన్నారుల్లో నలుగురి మృతదేహాలను గుర్తించారు. పిల్లలందరి వివరాలను సేకరిస్తున్నారు.
మృతదేహం దొరికిన మూడు నిమిషాల్లోనే పోస్టుమార్టం నిర్వహిస్తారు. శిబిరాల్లో నివసిస్తు్న్న ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఇన్ఫెక్షన్లకు కారమయ్యే అవకాశం ఉండటంతో జంతువుల మృతదేహాలను తక్షణమే తొలగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు సహా 450 భవనాలు దెబ్బతిన్నాయని ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ ఎ కౌశిగన్ తెలిపారు. అనాథ శవాలకు ప్రోటోకాల్ ప్రకారం దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక అధికారి సాంబశివరావు తెలిపారు. 129 మొబైల్ ఫ్రీజర్లు అందుబాటులో ఉన్నాయి, వీటిలో 59 ఉపయోగించబడుతున్నాయి. మొబైల్ ఫ్రీజర్లను అందించేందుకు కర్ణాటక సిద్ధమైంది. గుర్తించని మృతదేహాలను దహనం చేయడంపై గ్రామ పంచాయతీలే నిర్ణయం తీసుకుంటాయి
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!