Lok Sabha Elections: షెడ్యూల్ ప్రకటనకు ముందు కేంద్ర హోంశాఖతో ఈసీ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికలకు సమయం ఎక్కువ లేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం చకచక పనులను పూర్తి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై అధికారులు పర్యటనలు నిర్వహించారు. ఈ నెల మధ్యలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీజేపీ తొలి విడతగా 195 ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఈ రోజు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సమావేశమవ్వనుంది. భద్రతను సమీక్షించేందుకు ఈసీ అధికారులు, హోం అధికారులతో భేటీకానున్నారు. రాష్ట్రాల్లో కేంద్ర బలగాల మోహరింపుపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శుక్రవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెత్తో సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం 3.4 లక్షల మంది కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను ఎన్నికల కమిషనర్ కోరారు. 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దేశం అంతటా దాదాపుగా 12.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!