DAP Prices: రైతులకు షాక్.. జనవరి నుంచి పెరగనున్న డీఏపీ ధర
- రైతులకు మరోసారి షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..
- జనవరి నుంచి డీఏపీ 50 కిలోల బ్యాగ్పై ధర రూ. 200 పెంపు..
- అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్యలతోనే ఈ ధరల పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DAP Prices: రైతులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈసారి డై–అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP) ధర జనవరి నుంచి పెరిగే అవకాశం ఉంది. 50 కిలోల బ్యాగ్పై సుమారు 200 రూపాయల వరకు పెరగనుందని సమాచారం. అయితే, డీఏపీ దిగుమతులకు కేంద్రం ఇప్పటి వరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు డిసెంబర్తో ముగియడంతో.. దీని పొడిగింపుపై మోడీ సర్కార్ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. అంతేకాదు, డాలర్తో రూపాయి మారకం విలువ క్రమంగా పడిపోతుంది.
Read Also: Jairam Ramesh: రూపాయి పతనంపై మోడీ ఎందుకు స్పందించట్లేదు
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
ఈ నేపథ్యంలో దిగుమతి వ్యయం పెరగడంతోనే డీఏపీ ధర పెరిగే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఫాస్ఫేటిక్ ఎరువుల్లో 90 శాతం వరకు దిగుమతి అవుతున్నాయి. దేశంలో ఏటా 100 లక్షల టన్నుల డీఏపీ వినియోగిస్తుండగా.. అందులో 60 లక్షల టన్నుల వరకు ఇంపోర్ట్ అవుతుంది. ఇక, దేశీయ ఉత్పత్తికి వినియోగించే ముడి పదార్థాలైన రాక్ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ యాసిడ్ను కూడా భారత్ దిగుమతి చేసుకుంటుంది.
Read Also: PSLV-c60: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ 60.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలు!
కాగా, రైతులకు డీఏపీ ధరను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కేంద్రం దిగమతులపై టన్నుకు రూ.3,500 ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ఈ గడువు డిసెంబర్తో 31తో అయిపోయింది. ఈ ప్రోత్సాహకాల కొనసాగింపుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. దీంతో ప్రస్తుతం 50 కిలోల బ్యాగ్ ధర రూ.1,350 ఉండగా, అది 12–15 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే సుమారు రూ.200 వరకు పెరిగి రూ.1,550గా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక, అంతర్జాతీయంగా ధరల పెరుగుదల, చైనా నుంచి ముడి సరుకు సరఫరా తగ్గడం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణా పరమైన సమస్యలు ధరలు పెరుగుదలకు ప్రధాన కారణాలని కేంద్ర సర్కార్ చెప్తుంది.
తాజావార్తలు
-
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్తో బెంగళూరుకు!
-
Varanasi : సూపర్ స్టార్ బర్త్డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
-
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్కే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!