DAP Prices: రైతులకు షాక్.. జనవరి నుంచి పెరగనున్న డీఏపీ ధర
- రైతులకు మరోసారి షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..
- జనవరి నుంచి డీఏపీ 50 కిలోల బ్యాగ్పై ధర రూ. 200 పెంపు..
- అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్యలతోనే ఈ ధరల పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DAP Prices: రైతులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈసారి డై–అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP) ధర జనవరి నుంచి పెరిగే అవకాశం ఉంది. 50 కిలోల బ్యాగ్పై సుమారు 200 రూపాయల వరకు పెరగనుందని సమాచారం. అయితే, డీఏపీ దిగుమతులకు కేంద్రం ఇప్పటి వరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు డిసెంబర్తో ముగియడంతో.. దీని పొడిగింపుపై మోడీ సర్కార్ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. అంతేకాదు, డాలర్తో రూపాయి మారకం విలువ క్రమంగా పడిపోతుంది.
Read Also: Jairam Ramesh: రూపాయి పతనంపై మోడీ ఎందుకు స్పందించట్లేదు
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఈ నేపథ్యంలో దిగుమతి వ్యయం పెరగడంతోనే డీఏపీ ధర పెరిగే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఫాస్ఫేటిక్ ఎరువుల్లో 90 శాతం వరకు దిగుమతి అవుతున్నాయి. దేశంలో ఏటా 100 లక్షల టన్నుల డీఏపీ వినియోగిస్తుండగా.. అందులో 60 లక్షల టన్నుల వరకు ఇంపోర్ట్ అవుతుంది. ఇక, దేశీయ ఉత్పత్తికి వినియోగించే ముడి పదార్థాలైన రాక్ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ యాసిడ్ను కూడా భారత్ దిగుమతి చేసుకుంటుంది.
Read Also: PSLV-c60: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ 60.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలు!
కాగా, రైతులకు డీఏపీ ధరను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కేంద్రం దిగమతులపై టన్నుకు రూ.3,500 ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ఈ గడువు డిసెంబర్తో 31తో అయిపోయింది. ఈ ప్రోత్సాహకాల కొనసాగింపుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. దీంతో ప్రస్తుతం 50 కిలోల బ్యాగ్ ధర రూ.1,350 ఉండగా, అది 12–15 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే సుమారు రూ.200 వరకు పెరిగి రూ.1,550గా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక, అంతర్జాతీయంగా ధరల పెరుగుదల, చైనా నుంచి ముడి సరుకు సరఫరా తగ్గడం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో రవాణా పరమైన సమస్యలు ధరలు పెరుగుదలకు ప్రధాన కారణాలని కేంద్ర సర్కార్ చెప్తుంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..