Congress: అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ కీలక సమావేశం జరుగుతోంది. ఆరు దశాబ్ధాల తర్వతా గుజరాత్లో ఏఐసీసీ అత్యున్న సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న 2000 మంది వరకు ప్రముఖ నేతలకు ఆహ్వానం అందింది. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో 7 కీలక తీర్మానాలు చేసింది.
1) రైతుల హక్కుల కోసం పోరాటం చేయడం.
నల్లచట్టాలు, msp పెంపు లాంటి అంశాలపై రైతులకు అండగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తి తో పోరాటం. బీజేపీ క్రూరమైన బ్రిటిష్ విధానాలను అవలంబిస్తుందని విమర్శలు. ర
2) దేశంలో విద్వేష రాజకీయాలపై పోరాటం చేయాలని నిర్ణయించింది.
బీజేపీ దేశంలో ఐక్యత స్పూర్తిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రాంతీయ విద్వేషాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది. సర్దార్ పటేల్ బలమైన నాయకత్వం, జవహర్ లాల్ నెహ్రూ దూరదృష్టితో దేశంలో 560కి పైగా సంస్థానాలు విలీనమై ప్రజాస్వామ్య పునాది పడింది. దీనిని బీజేపీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. దేశంలో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తీర్మానం చేసింది.
3) కార్మికులు, కర్షకుల హక్కుల కోసం పోరాటం.
4) సామాజిక న్యాయం కోసం పోరాటం.
5) సమాజంలో అసమానతలు, అంతరాలపై తీర్మానం.
బ్రిటీష్ వారు దేశ వనరులు దోచుకున్నారు, ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడి సంపదను దోచుకుంటోంది. క్రోనీ క్యాపిటలిస్టులకు దేశ ఖజానాను ఉపయోగిస్తోంది. ఇది సమాజంలో అసమానతలను, అంతరాలను పెంచుతోంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని తీర్మానం చేశారు.
6) హింసా, మతతత్వానికి వ్యతిరేకంగా తీర్మానం.
సర్దార్ వల్లభబాయ్ పటేల్ ఫిబ్రవరి 4, 1948లో ఆర్ఎస్ఎస్ని నిషేధించారు. తన లేఖలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని గురించి ప్రస్తావించారు. కానీ నేను హింస, మతతత్వం యొక్క భావజాలం దేశాన్ని అగాధంలోకి నెట్టివేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్ నిశ్చయతను అనుసరించాలని తీర్మానం చేసింది.
7) గాంధీ-నెహ్రూ-పటేల్ యొక్క విడదీయరాని నాయకత్వం, దీనిపై ప్రస్తుతం దాడి జరుగుతుంది. శత్రుత్వం, విభజన శక్తుల్ని ఎదుర్కోవాలని తీర్మానం.