CUET UG-2022 Results: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 259 నగరాలు/పట్టణాల్లో 489 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని ఆరు నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తంగా ఆరు దశలుగా జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 14.9లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు. తొలుత గురువారం రాత్రి 10 గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడతాయని ప్రకటించారు. అయితే కొన్ని కారణాలతో ఆలస్యం అవుతోందని సమయం పడుతుందని ఎన్టీఏ ట్వీట్ చేసింది.
44 సెంట్రల్ యూనివర్సిటీలు, 12 స్టేట్ యూనివర్సిటీలు, 11డీమ్డ్ యూనివర్సిటీలు, 19 ప్రైవేట్ వర్సీటీలతో కలిపి దేశవ్యాప్తంగా 99 యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తొలసారి ఈ పరీక్షను నిర్వహించారు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఈ ఫలితాలు విడుదల చేసినట్టు ఎన్టీఏ తెలిపింది. ఫలితాలను ఫలితాలను www.nta.ac.in, https://cuet.samarth.ac.in వెబ్సైట్ల ద్వారా చూసుకోవచ్చు.మరోవైపు, యూనివర్సిటీలు కొత్త విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ ఆఖర్లో లేదా నవంబర్ తొలి వారం నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ తెలిపారు.
Telangana Liberation Celebrations: నేడు నగరానికి కేంద్ర మంత్రులు.. షెడ్యూల్ ఖరారు
గతంలో సీయూఈటీ యూజీ ఫలితాలను సెప్టెంబర్ 15వ తేదీలోగా లేదా వీలైతే రెండు రోజుల ముందుగా ప్రకటిస్తామని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ గతవారం ప్రకటించారు. అన్నట్లుగానే కొన్ని గంటలు అటు ఇటుగా ఫలితాలను ప్రకటించారు.