CR Kesavan: కాంగ్రెస్కు భారీ షాక్.. బీజేపీలో చేరిన సీ రాజగోపాలాచారి ముని మనవడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CR Kesavan: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ముని మనవడు సిఆర్ కేశవన్ శనివారం బిజెపిలో చేరారు. దక్షిణాదిలో మరింగా విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే దక్షిణాదికి చెందిన ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకుంటోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేశవన్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో కాంగ్రెస్కు మరో షాక్ తగిలినట్లు అయింది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూనీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
Read Also: Errabelli Dayakar Rao: ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం.. మోడీని గద్దె దించుతాం..
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా కేంద్రీకృత విధానాలు, అవినీతి రహిత, సమ్మిళిత పాలన నచ్చే బీజేపీలో చేరినట్లు ఆయన వెల్లడించారు. మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు. మోదీ ప్రభుత్వం జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిందని, భారతదేశ చరిత్ర, సంప్రదాయాలకు ప్రాధన్యత ఇస్తుందని ఇటీవల జరిగిన ‘ కాశీ- తమిళ సమాగం’ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. కోవిడ్-19 మహమ్మారిని కేంద్రం అడ్డుకు్న తీరును కేశవన్ ప్రశంసించారు. భారత్ ప్రపంచ స్థాయికి చేరడానికి మోదీనే కారణం అని అన్నారు.
దేశానికి రాజగోపాలాచారి చేసిన కృషి గురించి కేశవన్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆయనను పక్కన పెట్టారని, ఒకే కుటుంబం తామే అన్ని చేశామని చెప్పేందుకు ప్రయత్నించిందని పరోక్షంగా నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శించారు. ప్రస్తుతం బీజేపీలో చేరిన కేశవన్ తమిళనాడులో ఆ పార్టీకి బలంగా మారుతారని అనుకుంటోంది. తమిళనాడులో అన్నామలై సారధ్యంలో బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తోంది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళకు చెందిన ఏకే అంటోని కొడుకు అనిల్ ఆంటోనిని బీజేపీలో చేరారు. నిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!