Corona: దేశంలో కొత్తగా 12,899 కేసులు, 15 మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలం నుంచి తగ్గుతూ వస్తున్న కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పది రోజుల క్రితం వరకు రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేలకు దిగువనే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య 10 వేలను దాటుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరుగుతోంది. దీంతో మళ్లీ ప్రజల్లో కరోనా భయాలు నెలకొన్నాయి. ఫోర్త వేవ్ తప్పదా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండే దేశంలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రల్లోనే నమోదు అవుతున్నాయి. మహరాష్ట్రలో నమోదు అవుతున్న కేసుల్లో సగం కేసులు ఒక్క ముంబై మహానగరంలోనే ఉంటున్నాయి.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 15 మంది మరణించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 72,474కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,518 రికవరీలు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తంగా 5,24,855 మరణాలు నమోదు కాగా.. 4,26,99,363 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.17 కాగా, రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అదికారిక లెక్కల ప్రకారం దేశంలో రోజూవారీ పాజిటివిటీ రేటు 2.89 శాతం కాగా.. వారం పాజిటివిటీ రేటు 2.50శాతంగా నమోదు అయింది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు అర్హులైన వారికి 196.14 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు. గడిచిన 24 గంటల్లో 4,46,387 వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
COVID19 | India reports 12,899 fresh infections & 15 deaths today; Active cases rise to 72,474 pic.twitter.com/aqHyJhGTdn
— ANI (@ANI) June 19, 2022
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!