Corona: దేశంలో కొత్తగా 12,899 కేసులు, 15 మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలం నుంచి తగ్గుతూ వస్తున్న కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పది రోజుల క్రితం వరకు రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేలకు దిగువనే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య 10 వేలను దాటుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరుగుతోంది. దీంతో మళ్లీ ప్రజల్లో కరోనా భయాలు నెలకొన్నాయి. ఫోర్త వేవ్ తప్పదా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండే దేశంలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువగా ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రల్లోనే నమోదు అవుతున్నాయి. మహరాష్ట్రలో నమోదు అవుతున్న కేసుల్లో సగం కేసులు ఒక్క ముంబై మహానగరంలోనే ఉంటున్నాయి.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 15 మంది మరణించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 72,474కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,518 రికవరీలు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తంగా 5,24,855 మరణాలు నమోదు కాగా.. 4,26,99,363 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.17 కాగా, రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
అదికారిక లెక్కల ప్రకారం దేశంలో రోజూవారీ పాజిటివిటీ రేటు 2.89 శాతం కాగా.. వారం పాజిటివిటీ రేటు 2.50శాతంగా నమోదు అయింది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు అర్హులైన వారికి 196.14 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు. గడిచిన 24 గంటల్లో 4,46,387 వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
COVID19 | India reports 12,899 fresh infections & 15 deaths today; Active cases rise to 72,474 pic.twitter.com/aqHyJhGTdn
— ANI (@ANI) June 19, 2022
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!