COVID 19: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసుల పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో పాటు ఇటీవల తెలంగాణలో కూడా కొన్ని రోజుల నుంచి 400కు పైగా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే పాజిటివిటీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల కరోనా వల్ల మరణాలను మాత్రం అదుపు చేయగలుగుతున్నాం.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 24 మంది మహమ్మారి బారినపడి మరణించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 1,13,864కి చేరుకుంది. గడిచిన ఒక్కరోజులు కరోనా నుంచి 13,958 కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 4.85గా నమోదు అయింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటి వరకు 5,25,223 మరణించారు. 4,28,79,477 నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల శాతం 1.21 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: Naresh Pavithra Lokesh: నరేష్ కు విడాకులు ఇవ్వను..? రమ్య శపథం!
మరోవైపు దేశంలో నిన్న ఒక్క రోజు 1,78,383 వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు దేశంలో అర్హులైన వారికి 1,97,98,21,197 కరోనా వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చారు. ఆదివారం రోజు 3,32,978 టెస్టులు చేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతోంది. తాజాగా డబ్ల్యూ హెచ్ వో తెలిపిన దాని ప్రకారం ప్రపంచంలో 110 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో 55,43,43,968 మంది కరోనా బారిన పడ్డారు. 63,61,372 మరణాలు సంభవించాయి.
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..