COVID-19: హడలెత్తిస్తున్న కోవిడ్.. 4,302కు చేరిన కేసులు
- హడలెత్తిస్తున్న కోవిడ్
- ప్రస్తుతం 4,302కు చేరిన కేసులు
- 24 గంటల్లో ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత వారం కంటే ఈ వారం వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చనిపోగా.. మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా 4, 302 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Damodara Raja Narasimha : ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్.. రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో కరోనాపై సంరక్షక మంత్రి గణేష్ నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ మరణాల పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. గత 24 గంటల్లో దాదాపు 300 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేరళలో రోజువారీ కేసులు అత్యధికంగా నమోదవుతూనే ఉన్నాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Abhirami : 42 ఏళ్ల వయసులోనూ .. తరగని అందంతో అభిరామి..
రాష్ట్రాల వారీగా కేసులు..
గుజరాత్లో మంగళవారం 108 కొత్త కేసులు నమోదు కాగా.. ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 461కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మహారాష్ట్రలో 86 కొత్త కేసులు నమోదు కాగా.. నలుగురు చనిపోయారు. యాక్టివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 510కి పెరిగింది. నాగ్పూర్, చంద్రపూర్, మిరాజ్ వంటి జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి.
దేశంలో అత్యధికంగా 1,446 యాక్టివ్ కేసులతో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ (393) కేసులు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లో 41 కొత్త ఇన్ఫెక్షన్లు, కోల్కతాలో ఒక మరణం చోటుచేసుకుంది. కోమోర్బిడిటీలతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మరణించింది.
హర్యానాలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్లో ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 51గా ఉన్నాయి.
గత మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్లో 38 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి.
గ్వాలియర్ మరియు హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలలో కూడా కొత్త కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ పలు సూచనలు
ప్రతి తాలూకాలో కోవిడ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి
బహిరంగ ప్రదేశాలు, తినుబండారాల క్రిమిసంహారక చర్య చేపట్టాలి
పాఠశాలల్లో పారిశుధ్యాన్ని పాటించాలి
పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, శానిటైజర్ల వాడకంపై సలహాలు ఇవ్వాలి
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!