COVID-19: హడలెత్తిస్తున్న కోవిడ్.. 4,302కు చేరిన కేసులు
- హడలెత్తిస్తున్న కోవిడ్
- ప్రస్తుతం 4,302కు చేరిన కేసులు
- 24 గంటల్లో ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత వారం కంటే ఈ వారం వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చనిపోగా.. మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా 4, 302 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Damodara Raja Narasimha : ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్.. రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
Also Read
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో కరోనాపై సంరక్షక మంత్రి గణేష్ నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ మరణాల పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. గత 24 గంటల్లో దాదాపు 300 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేరళలో రోజువారీ కేసులు అత్యధికంగా నమోదవుతూనే ఉన్నాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Abhirami : 42 ఏళ్ల వయసులోనూ .. తరగని అందంతో అభిరామి..
రాష్ట్రాల వారీగా కేసులు..
గుజరాత్లో మంగళవారం 108 కొత్త కేసులు నమోదు కాగా.. ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 461కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మహారాష్ట్రలో 86 కొత్త కేసులు నమోదు కాగా.. నలుగురు చనిపోయారు. యాక్టివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 510కి పెరిగింది. నాగ్పూర్, చంద్రపూర్, మిరాజ్ వంటి జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి.
దేశంలో అత్యధికంగా 1,446 యాక్టివ్ కేసులతో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ (393) కేసులు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లో 41 కొత్త ఇన్ఫెక్షన్లు, కోల్కతాలో ఒక మరణం చోటుచేసుకుంది. కోమోర్బిడిటీలతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మరణించింది.
హర్యానాలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్లో ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 51గా ఉన్నాయి.
గత మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్లో 38 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి.
గ్వాలియర్ మరియు హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలలో కూడా కొత్త కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ పలు సూచనలు
ప్రతి తాలూకాలో కోవిడ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి
బహిరంగ ప్రదేశాలు, తినుబండారాల క్రిమిసంహారక చర్య చేపట్టాలి
పాఠశాలల్లో పారిశుధ్యాన్ని పాటించాలి
పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, శానిటైజర్ల వాడకంపై సలహాలు ఇవ్వాలి
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!