COVID-19: హడలెత్తిస్తున్న కోవిడ్.. 4,302కు చేరిన కేసులు
- హడలెత్తిస్తున్న కోవిడ్
- ప్రస్తుతం 4,302కు చేరిన కేసులు
- 24 గంటల్లో ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా విజృంభిస్తోంది. గత వారం కంటే ఈ వారం వేగంగా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చనిపోగా.. మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా 4, 302 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Damodara Raja Narasimha : ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్.. రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
Also Read
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో కరోనాపై సంరక్షక మంత్రి గణేష్ నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ మరణాల పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. గత 24 గంటల్లో దాదాపు 300 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేరళలో రోజువారీ కేసులు అత్యధికంగా నమోదవుతూనే ఉన్నాయని తెలిపింది.
ఇది కూడా చదవండి: Abhirami : 42 ఏళ్ల వయసులోనూ .. తరగని అందంతో అభిరామి..
రాష్ట్రాల వారీగా కేసులు..
గుజరాత్లో మంగళవారం 108 కొత్త కేసులు నమోదు కాగా.. ఒకరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 461కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మహారాష్ట్రలో 86 కొత్త కేసులు నమోదు కాగా.. నలుగురు చనిపోయారు. యాక్టివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 510కి పెరిగింది. నాగ్పూర్, చంద్రపూర్, మిరాజ్ వంటి జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి.
దేశంలో అత్యధికంగా 1,446 యాక్టివ్ కేసులతో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ (393) కేసులు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లో 41 కొత్త ఇన్ఫెక్షన్లు, కోల్కతాలో ఒక మరణం చోటుచేసుకుంది. కోమోర్బిడిటీలతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మరణించింది.
హర్యానాలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్లో ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 51గా ఉన్నాయి.
గత మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్లో 38 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి.
గ్వాలియర్ మరియు హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలలో కూడా కొత్త కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ పలు సూచనలు
ప్రతి తాలూకాలో కోవిడ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి
బహిరంగ ప్రదేశాలు, తినుబండారాల క్రిమిసంహారక చర్య చేపట్టాలి
పాఠశాలల్లో పారిశుధ్యాన్ని పాటించాలి
పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, శానిటైజర్ల వాడకంపై సలహాలు ఇవ్వాలి
తాజావార్తలు
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
-
Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
-
Prabhas : ‘స్పిరిట్’ పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!