Maha Kumbh Mela: కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణం.. 16,000 మొబైల్ నెంబర్లపై దర్యాప్తు..
- కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర అనుమానం..
- 16000 మొబైల్ నెంబర్లపై దర్యాప్తు చేస్తున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరగుతున్న మహా కుంభమేళాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది యోగి ప్రభుత్వం. ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపీ అధికారులు అలర్ట్ అయ్యారు. జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉండవచ్చేని అనుమానిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చురుకుగా ఉన్న 16,000 కంటే ఎక్కువ మొబైల్ నెంబర్ డేటాను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఆ నంబర్లలో చాలా వరకు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కంట్రోల్ రూం నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ నుంచి అనుమానితుల ముఖాలను గుర్తించే యాప్ ద్వారా గుర్తిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
Read Also: Nayanthara: వాళ్ళ కారణంగా నయనతార నరకం చూసింది.. నిజాలు బయటపెట్టిన నాగార్జున !
వసంత పంచమ సందర్భంగా సోమావారం జరగనున్న మూడో అమృత స్నానం సమయంలో అదనపు భద్రతను మోహరించారు. నాల్గవ మహా స్నానం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ నాడు జరుగుతుండగా, చివరిది ఫిబ్రవరి 26న మహా శివరాత్రి నాడు జరుగుతుంది. ఇటీవల తొక్కిసలాటలో మరణించిన 30 మంది బాధితుల్లో ఎక్కువ మంది బీహార్ నుంచే ఉన్నారు. మౌని అమావాస్య రోజున భారీగా ప్రజలు రావడంతో తొక్కిసలాట జరిగింది. 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
తొక్కిసలాటపై దర్యాప్తు చేయడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. శుక్రవారం వీరు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ ప్యానెల్ నెల రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది.
తాజావార్తలు
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!