Uddhav Thackeray: ‘‘కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ముంచింది’’.. మహా ఓటమితో విభేదాలు..
- కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓడిపోయాం..
- హస్తం తీరుపై ఠాక్రే సేన విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి దారుణంగా ఓడిపోయింది. 288 స్థానాల్లో బీజేపీ కూటమి 233 సీట్లను సాధిస్తే, ఎంవీఏ 49 సీట్లకే పరిమితమైంది. ఈ పరిణామం ఎంవీఏ కూటమిలో విభేదాలకు కారణమైంది. తాజాగా ఎంవీఏ కూటమి ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రిగా భావించి ఉండాల్సిందని మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే అన్నారు.
Read Also: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత హర్యానా, జమ్మూ కాశ్మీర్లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది. ఇది ఫలితాల్లో ప్రతిబింబించింది. సీట్ల పంపకాల చర్చల సమయంలో దాని వైఖరి మమ్మల్ని బాధించింది. ఉద్దవ్ ఠాక్రేని సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంది. అలా చేయకపోవడం మా అవకాశాలను దెబ్బతీసింది. ఇలా చేసి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి’’ అని దాన్వే అన్నారు.
ఎన్నికలకు ముందు సీట్ల పంపకాలలో సమయంలో కూడా శివసేన ఠాక్రే వర్గం, కాంగ్రెస్కి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. సంజయ్ రౌత్, కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానాపటోలేని బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 స్థానాల్లోనే గెలుపొందింది. 89 సీట్లలో పోటీ చేసిన శివసేన ఠాక్రే వర్గం 20 స్థానాలను గెలుచుకుంది. 87 స్థానాల్లో పోటీ చేసిన ఎన్సీపీ శరద్ పవార్ కేవలం 10 అసెంబ్లీల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 288 స్థానాల్లో పోటీ చేసే స్థాయికి ఠాక్రే సేన తన బలాన్ని పెంచుకోవడానికి సిద్ధమవుతుందని దాన్వే చెప్పారు. ఏక్నాథ్ షిండే వల్ల శివసేన చీలిపోయిందని, బీజేపీకి చాలా రాష్ట్రాల్లో షిండేలు ఉన్నారని, వారిని బీజేపీ వాడుకుని పారేస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!