Haryana Polls: ఎగ్జిట్ పోల్స్తో కాంగ్రెస్లో జోష్.. సీఎం కుర్చీపై మొదలైన లాబీయింగ్!
- ఎగ్జిట్ పోల్స్తో హర్యానా కాంగ్రెస్లో జోష్
- సీఎం కుర్చీపై మొదలైన లాబీయింగ్!
హర్యానా అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 61 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే పోలింగ్ ముగియగానే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఆ సంస్థలు చేసిన సర్వేలు విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వేలు హర్యానాలో కాంగ్రెస్కే మొగ్గుచూపించాయి. మెజార్టీ మార్కు దాటి హస్తం పార్టీ ప్రభుత్వాన్ని దక్కించుకుంటుందని సర్వేలు తేల్చాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 55కి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటాయని వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: CPI Ramakrishna: బీజేపీ, మజ్లీస్ పార్టీలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలు..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇదిలా ఉంటే హర్యానాలో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందన్న సర్వేలు తేల్చడంతో ముఖ్యమంత్రి పీఠంపై చర్చ మొదలైంది. ప్రధానంగా పార్టీ సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్దీప్ సూర్జేవాలా, భూపీందర్ సింగ్ హుడా పేర్లు వినిపిస్తున్నాయి. భూపీందర్ సింగ్ హుడా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎవర్న దానిపై పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భావిస్తున్నామని… బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని భూపీందర్ సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Amit Shah: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సోమవారం అమిత్ షా కీలక భేటీ..
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 61 శాతం పోలింగ్ నమోదైంది. ఇక జమ్మూకాశ్మీర్లో హంగ్ ఏర్పడనున్నట్లు పేర్కొన్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
హర్యానా ఎగ్జిట్ పోల్స్..
మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం.. బీజేపీకి 18-24, కాంగ్రెస్కి 56-62, జేజేపీకి 0-3 స్థానాలు వస్తాయని చెప్పింది.
పోల్ ఆఫ్ పోల్స్: బీజేపీ- 22, కాంగ్రెస్- 59 , జేజేపీ- 02
దైనిక్ భాస్కర్: బీజేపీ 15-29, కాంగ్రెస్ 44-54, జేజేపీ 0-1, ఆప్ 0-1, ఇతరులు 4-9
ధ్రువ్ రీసెర్చ్: బీజేపీ 22-32, కాంగ్రెస్ 50-64
పీపుల్స్ పల్స్: 20-32, కాంగ్రెస్ 49-61
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!