Sonia Gandhi: 15న సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కీలక భేటీ.. దేనికోసమంటే..!
- జూలై 15న సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కీలక భేటీ
- వర్షాకాల పార్లమెంట్ సమావేశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. మంగళవారం ఈ భేటీ జరగనుంది. జూలై 21 నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల గురించి చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Netanyahu: అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కొత్త ఎత్తుగడ! ఈ వారంలోనే ప్లాన్ అమలు
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
ఇక జూలై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షంగా.. అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాలు హాట్ హాట్గా జరిగే సూచనలు కనిపిస్తు్న్నాయి. అనేక అంశాలపై ప్రతిపక్ష-అధికార పక్షాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉంది. ఇక బీహార్లో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళనలు వ్యక్తపరిచే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్తో పాటు దౌత్యపరమైన చర్యలపై కూడా చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Health Tips: వర్షాకాలం వ్యాధుల కాలం.. ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే.. ప్రమాదంలో పడ్డట్టే!
కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహాత్మక బృందం సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తదితరులు హాజరుకానున్నారు. దీనికి సోనియా గాంధీ అధ్యక్షతన జనపథ్ నివాసంలో ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. ఈ సమావేశాలు ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా.. వారం పాటు పొడిగించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!