Saudi-Pak defence deal: సౌదీ-పాక్ ఒప్పందం, భారత భద్రతకు ముప్పు: కాంగ్రెస్..
- సౌదీ-పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం..
- భారత జాతీయ భద్రతకు ముప్పు అని కాంగ్రెస్ ఆందోళన..
- మోడీ దౌత్య విధానం విఫలమైందని వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi-Pak defence deal: సౌదీ అరేబియా పాకిస్తాన్తో “వ్యూహాత్మక పరస్పర రక్షణ” ఒప్పందంపై కాంగ్రెస్ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది భారత ప్రధాని నరేంద్రమోడీ దౌత్యానికి ఎదురుదెబ్బగా దీనిని అభివర్ణించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ అకస్మాత్తుగా ఆగిపోయిన నెల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు వైట్ హౌజ్లో విందు ఇచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడిని రెచ్చగొట్టేలా ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు చేశారని పోస్టులో పేర్కొన్నారు.
Read Also: CJI BR Gavai: ‘‘అన్ని మతాలను గౌరవిస్తాను’’.. ‘‘విష్ణువు’’ వ్యాఖ్యలపై సీజేఐ గవాయ్..
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
మన ప్రధాని చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన కొద్ది రోజులకే, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనా రహస్య సైనిక సముదాయాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి చూపించారని ఆయన చెప్పారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్-సౌదీతో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేసిందని జైరాం రమేష్ అన్నారు. ఇది భారత జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని చెప్పారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశమైనా ఈ రెండు దేశాల్లో ఒక దేశంపై దాడి చేసినా, రెండో దేశంపై చేసినట్లే అవుతుందని ప్రకటించింది. ఖతార్పై ఇజ్రాయిల్ దాడి చేసిన కొన్ని రోజులకే ఈ ఒప్పందం వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు తమ భద్రతను పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం, సౌదీ అరేబియా ఇజ్రాయిల్ టార్గెట్గా ఈ ఒప్పందంపై సంతకం చేసిందని చెబుతున్నారు. దీనిపై భారత విదేశాంగ స్పందిస్తూ.. భారతదేశం తన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ మరియు ప్రపంచ స్థిరత్వం కోసం ఈ చర్య యొక్క చిక్కులను అధ్యయనం చేస్తుందని చెప్పింది.
తాజావార్తలు
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!