Saudi-Pak defence deal: సౌదీ-పాక్ ఒప్పందం, భారత భద్రతకు ముప్పు: కాంగ్రెస్..
- సౌదీ-పాకిస్తాన్ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం..
- భారత జాతీయ భద్రతకు ముప్పు అని కాంగ్రెస్ ఆందోళన..
- మోడీ దౌత్య విధానం విఫలమైందని వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi-Pak defence deal: సౌదీ అరేబియా పాకిస్తాన్తో “వ్యూహాత్మక పరస్పర రక్షణ” ఒప్పందంపై కాంగ్రెస్ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది భారత ప్రధాని నరేంద్రమోడీ దౌత్యానికి ఎదురుదెబ్బగా దీనిని అభివర్ణించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ అకస్మాత్తుగా ఆగిపోయిన నెల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు వైట్ హౌజ్లో విందు ఇచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడిని రెచ్చగొట్టేలా ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలు చేశారని పోస్టులో పేర్కొన్నారు.
Read Also: CJI BR Gavai: ‘‘అన్ని మతాలను గౌరవిస్తాను’’.. ‘‘విష్ణువు’’ వ్యాఖ్యలపై సీజేఐ గవాయ్..
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
మన ప్రధాని చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన కొద్ది రోజులకే, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనా రహస్య సైనిక సముదాయాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి చూపించారని ఆయన చెప్పారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్-సౌదీతో వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేసిందని జైరాం రమేష్ అన్నారు. ఇది భారత జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని చెప్పారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశమైనా ఈ రెండు దేశాల్లో ఒక దేశంపై దాడి చేసినా, రెండో దేశంపై చేసినట్లే అవుతుందని ప్రకటించింది. ఖతార్పై ఇజ్రాయిల్ దాడి చేసిన కొన్ని రోజులకే ఈ ఒప్పందం వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాలు తమ భద్రతను పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం, సౌదీ అరేబియా ఇజ్రాయిల్ టార్గెట్గా ఈ ఒప్పందంపై సంతకం చేసిందని చెబుతున్నారు. దీనిపై భారత విదేశాంగ స్పందిస్తూ.. భారతదేశం తన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ మరియు ప్రపంచ స్థిరత్వం కోసం ఈ చర్య యొక్క చిక్కులను అధ్యయనం చేస్తుందని చెప్పింది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!