అఖిలేష్ పై పోటీ.. కాంగ్రెస్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ అసెంబ్లీ ఎన్నికలు వేడిని రాజేస్తున్నాయి. విజయం కోసం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీపై విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని బరిలో దింపరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై బీజేపీ మండిపడుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లా కర్హాల్ నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతోంది. అధికార బీజేపీకి గట్టి సవాల్ విసురుతున్న సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో ఆయన్ని ఓడించేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతున్న వేళ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. అఖిలేష్ పై కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ ను బీజేపీ బరిలో నిలిపింది. దీనికి ధీటుగా సమాజ్ వాదీ పార్టీ ముందుకెళుతోంది.
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ నియోజకవర్గంలో ఇంతకుముందే జ్ఞానవతి దేవికి ఇచ్చిన టికెట్ ను చివరి నిమిషంలో రద్దు చేసింది. నామినేషన్ పత్రాలు నింపవద్దంటూ ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి హడావిడిగా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు మెయిన్ పురి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ కులశ్రేష్ఠ జ్ఞానవతికి సమాచారం పంపారు. ఇవాళ నామినేషన్లకు తుదిగడువు కాగా, కాంగ్రెస్ నిర్ణయంతో ఇక్కడ ప్రధానంగా ద్విముఖ పోరు నెలకొంది.
1993 నుంచి కర్హాల్ నియోజకవర్గం సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట. 2002లో మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. తమకు బాగా పట్టున్న కర్హాల్ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. అఖిలేశ్ గతంలో నాలుగు పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా గెలిచారు. అఖిలేశ్ పై పోటీ చేస్తున్న సత్యపాల్ సింగ్ బఘేల్ ది కూడా ఆసక్తికరమైన చరిత్రే. ఆయన గతంలో ఉత్తరప్రదేశ్ లో పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. అప్పట్లో ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎంగా వున్నప్పుడు ఆయనకు భద్రతాధికారిగా వ్యవహరించారు. బఘేల్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ములాయం సింగ్ కాగా ఆయన తదనంతరం బీజేపీలో చేరారు.
బఘేల్… అఖిలేశ్ పై పోటీ చేయడం ఇది రెండోసారి. 2009లో ఫిరోజాబాద్ లోక్ సభ స్థానం నుంచి అఖిలేశ్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బఘేల్ ఆగ్రా ఎంపీగా ఉన్నారు. ఇద్దరి పోటీతో రాజకీయం రసవత్తరంగా మారింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!