అఖిలేష్ పై పోటీ.. కాంగ్రెస్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ అసెంబ్లీ ఎన్నికలు వేడిని రాజేస్తున్నాయి. విజయం కోసం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీపై విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని బరిలో దింపరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై బీజేపీ మండిపడుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లా కర్హాల్ నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతోంది. అధికార బీజేపీకి గట్టి సవాల్ విసురుతున్న సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో ఆయన్ని ఓడించేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతున్న వేళ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది. అఖిలేష్ పై కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ ను బీజేపీ బరిలో నిలిపింది. దీనికి ధీటుగా సమాజ్ వాదీ పార్టీ ముందుకెళుతోంది.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. అఖిలేష్ నియోజకవర్గంలో ఇంతకుముందే జ్ఞానవతి దేవికి ఇచ్చిన టికెట్ ను చివరి నిమిషంలో రద్దు చేసింది. నామినేషన్ పత్రాలు నింపవద్దంటూ ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి హడావిడిగా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు మెయిన్ పురి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ కులశ్రేష్ఠ జ్ఞానవతికి సమాచారం పంపారు. ఇవాళ నామినేషన్లకు తుదిగడువు కాగా, కాంగ్రెస్ నిర్ణయంతో ఇక్కడ ప్రధానంగా ద్విముఖ పోరు నెలకొంది.
1993 నుంచి కర్హాల్ నియోజకవర్గం సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట. 2002లో మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. తమకు బాగా పట్టున్న కర్హాల్ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. అఖిలేశ్ గతంలో నాలుగు పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా గెలిచారు. అఖిలేశ్ పై పోటీ చేస్తున్న సత్యపాల్ సింగ్ బఘేల్ ది కూడా ఆసక్తికరమైన చరిత్రే. ఆయన గతంలో ఉత్తరప్రదేశ్ లో పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. అప్పట్లో ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎంగా వున్నప్పుడు ఆయనకు భద్రతాధికారిగా వ్యవహరించారు. బఘేల్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ములాయం సింగ్ కాగా ఆయన తదనంతరం బీజేపీలో చేరారు.
బఘేల్… అఖిలేశ్ పై పోటీ చేయడం ఇది రెండోసారి. 2009లో ఫిరోజాబాద్ లోక్ సభ స్థానం నుంచి అఖిలేశ్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బఘేల్ ఆగ్రా ఎంపీగా ఉన్నారు. ఇద్దరి పోటీతో రాజకీయం రసవత్తరంగా మారింది.
తాజావార్తలు
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!