Haryana polls: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై ఉచిత వరాల జల్లులు
- కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
- హర్యానా ప్రజలపై ఉచిత వరాల జల్లులు
- ఉచిత విద్యుత్.. ఉచిత వైద్యం.. 500లకే గ్యాస్ హామీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, మహిళలకు ఆర్థిక సాయం, రైతులకు ఎంఎస్పీ హామీ, కుల గణన వంటి వాగ్దానాలు ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ.వేణుగోపాల్, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హర్యానా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
90 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇక అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలతో శనివారం భారీ మేనిఫెస్టో విడుదల చేసింది.
Also Read
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
హామీలు ఇవే..
ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్
రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం
18-60 ఏళ్ల మహిళలకు రూ.2000 ఆర్థిక సాయం
రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేత
రైతులకు (ఎంఎస్పీ) పంటలకు కనీస మద్దతు ధర హామీ
తక్షణ నష్టపరిహారం కోసం చట్టపరమైన హామీ
రైతు కమిషన్ ఏర్పాటు.. డీజిల్పై రాయితీ
పేదలకు 200 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు
కులాల వారీగా సర్వే నిర్వహిస్తామని హామీ
క్రీమీ లేయర్ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు
యువతకు 2 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలు
రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని హామీ
కేంద్రానికి విరుద్ధంగా పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేందుకు బుధప పెన్షన్, దివ్యాంగ్ పెన్షన్ మరియు విధ్వా పెన్షన్ కింద సీనియర్ సిటిజన్లు, వికలాంగులు మరియు వితంతువులకు వరుసగా రూ. 6000 ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. హామీలు అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.
హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. 2019లో బీజేపీ 40 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 30 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..