Congress: రాజస్థాన్ సంక్షోభం ముగియనే లేదు.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో విభేదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు పరిష్కారం కావడం లేదు. ఇరువురితో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేధాలు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
Read Also: Wrestlers Protest: అమిత్ షాను కలిసిన రెజ్లర్లు.. బ్రిజ్ భూషన్పై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి..
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్ నాథ్ ను ఎంపిక చేశారు. అయితే దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు విభేదిస్తున్నారు. మే 29న ఢిల్లీలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నేత గోవింద్ సింగ్ కు కమల్ నాథ్ విధేయుడైన ఎమ్మెల్యే సజ్జన్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది.
కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని, సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించడం కాంగ్రెస్ సంప్రదాయం కాదని, ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, వారు సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని అన్నారు. దీనికి ప్రతిస్పందగా సజ్జన్ సింగ్ మాట్లాడుతూ.. గోవింద్ సింగ్ ను ప్రతిపక్షనేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారో లేదో మర్చిపోతారని.. అతను ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడలేదని, సీనియర్ వ్యక్తి కావడం వల్లే ప్రతిపక్ష నేతగా నియమించామని అన్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు, పార్టీ నాయకులు కమల్నాథ్ను సీఎంగా కోరుకుంటున్నారని అన్నారు. హాజరైన 22 మంది నేతలు కమల్ నాథ్ ను తమ నాయకుడిగా అంగీకరించినట్లు సమావేశంలో నిర్ణయించారని తెలుస్తోంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా కమల్ నాథ్ నాయకత్వంలో ఎన్నికలు జరగాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారని అన్నారు.
తాజావార్తలు
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!