Manipur Violence: మణిపూర్లో హింసకు కాంగ్రెస్సే కారణం: సీఎం బీరేన్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: సుమారు మూడున్నర నెలలకు పైగా మణిపూర్లో హింస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్లో హింసను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన అనంతరం మణిపూర్లో ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న హింసకు కాంగ్రెస్సే కారణం మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మండిపడ్డారు. రాష్ట్రంలో హింసను సృష్టించింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. మనుషుల జీవితాలతో రాజకీయాలు చేయొద్దని బీరేన్ సింగ్ సూచించారు. లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మణిపూర్ హింసపై మాట్లాడటాన్ని సీఎం తప్పుపట్టారు. లడఖ్లో ఉంటే లడఖ్ గురించే మాట్లాడాలి కానీ మణిపూర్ గురించి కాదని హితవుపలికారు. లడఖ్ వెళ్తే అక్కడి సమస్యల గురిచే మాట్లాడాలి.. ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న వాటన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు ఎప్పటికప్పుడు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సలహాలు తీసుకుంటున్నామని సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
Read Also: Telangana: డాక్టర్ లేకపోవడంతో బాలింతకు కాన్పు చేసిన నర్సు..అయ్యో పాపం ఎంత పనైంది..
Also Read
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
పార్లమెంటులో ప్రధాని మోడీ, అమిత్ షాల ప్రకటనల తర్వాత మణిపూర్లో శాంతి నెలకొందని.. మణిపూర్ విడిచి వెళ్లిన వారు తిరిగి చేరుకుంటున్నారని.. ప్రజల పునరావాసం మరియు స్థిరనివాసం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం తెలిపారు. ఎన్. బీరేన్ సింగ్ గురువారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై వివరించారు. మణిపూర్లో సాధారణ స్థితిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా ఆయన అమిత్ షాకు తెలియజేశారు. మణిపూర్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రితో భేటీ సందర్భంగా సీఎంతో పాటు మణిపూర్కు చెందిన కొందరు మంత్రులు కూడా ఉన్నారు. “మేము హోంమంత్రి సలహా తీసుకోవడానికి ఇక్కడకు వచ్చాము” అని షాను కలవడానికి ముందు సింగ్ చెప్పారు. ఆగస్టు 29 న మణిపూర్ శాసనసభ యొక్క ఒక రోజు సమావేశానికి ముందు షా మరియు సింగ్ మధ్య సమావేశం జరిగింది.
రాష్ట్రంలో పరిస్థితులు మెల్లగా మెరుగవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?