BJP: ‘‘ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్’’.. ‘‘కాంగ్రెస్ ఒక ముస్లింలీగ్’’
- కాంట్రాక్టుల్లో 4 శాతం ముస్లిం రిజర్వేషన్..
- కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం..
- కాంగ్రెస్ ముస్లింలీగ్ అంటూ అమిత్ మాల్వియా విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ఒక నిర్దిష్ట మత సమాజానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని మండిపడింది. కాంగ్రెస్ని ‘‘ఆధునిక ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. కొన్ని రాజకీయ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
కర్ణాటక క్యాబినెట్ కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ(KTPP) చట్టానికి సవరణను ఆమోదించింది. ఇది ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించనుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధాన సభలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కేటీపీపీ చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ సవరణ చేయాలని నిర్ణయించారని అధికారిక వర్గాలు తెలిపాయి. మార్చి 7న కర్ణాటక ప్రభుత్వ బడ్జెట్ సమర్పిస్తూ, సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వ పనుల కాంట్రాక్టుల్లో 4 శాతం ఇప్పుడు ముస్లింలకు కేటగిరి -2బి అనే కేటగిరీ కింద రిజర్వ్ చేస్తామని చెప్పారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
Read Also: VC Sajjanar : బెట్టింగ్ యాప్లపై యుద్ధం.. సామాజిక మార్పు కోసం సజ్జనార్ పిలుపు
ఈ రిజర్వేషన్లపై బీజేపీ నేత అమిత్ మాల్వియా ధ్వజమెత్తారు. కర్ణాటక కాంగ్రెస్ ఒక వర్గానికి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ‘‘రాజ్యాంగ విరుద్ధం’’ అని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన పూర్తి దృష్టిని కేవలం రెండు విషయాలపైనే కేంద్రీకరిస్తుందని ఆరోపించారు. ఒకటి అవినీతి, రెండోది బుజ్జగింపు రాజకీయాలు అని మాల్వియా ఎక్స్లో విమర్శించారు. మతం ఆధారంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి, ప్రయోజనాలను అందించడానికి భారత రాజ్యంగం మద్దతు ఇవ్వదని మాల్వియా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. కాంగ్రెస్ అంటేనే న్యూ ముస్లిం లీగ్ అని విమర్శించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!